E-Paper
Advertisement

RTC Bus Collided with Car: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు- కారు ఢీ!

RTC Bus Collided with Car: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు- కారు ఢీ!

Bus accident in telangana today(): హైదరాబాద్- శ్రీశైలం జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు- కారు ఢీకొన్నాయి. కల్వకుర్తి నుంచి హైదరాబాద్‌కు కారు వస్తోంది. హైదరాబాద్ నుంచి శ్రీశైలం‌కు బస్సు వెళ్తున్నట్లు తెలుస్తోంది.

ఈ ఘటనలో కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలం వాసుదేవ్పూర్ గేటు సమీపంలో జరిగింది. ప్రమాదానికి కారు నుజ్జునుజ్జు అయ్యింది. మృతులు హైదరాబాద్‌లోని కర్మన్‌ఘాట్ వాసులుగా గుర్తించారు. 35 ఏళ్లగా శివకృష్ణ వరప్రసాద్ గౌడ్, నిఖిల్‌(26), మణిదీప్ (25) అందులో ఉన్నారు.

ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కారులో ఇరుక్కుపోయిన ముగ్గురి మృతదేహాలను జేసీబీ సాయంతో బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన కారు ఎవరిది? అనేదానిపై ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

Tags

Related News

పాలమూరు రైతులకు గుడ్ న్యూస్.. కృష్ణా జలాలపై సీఎం కీలక ప్రకటన

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Big Stories

×