Rythu Bharosa: తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త తెలిపింది. రాష్టంలో రైతులందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నటువంటి రైతు భరోసా నిధులపై తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. తెలంగాణ రైతు భరోసా పథకం (యాసంగి 2025-26) కింద కొత్త ధరఖాస్తులకు అవకాశం కల్పించింది. అందుకోసం కొత్తగా రైతులు దరఖాస్తు చేసుకోవాడానికి తేదిని ప్రకటించింది. దీంతో కొత్తగా భూమి పట్టా చేసుకున్నవారు రైతు భరోసాకు దరఖాస్తు చేసుకోవాలని సర్కార్ తెలిపింది. 28/02/2026 సంవత్సరం వరకు ఎవరైతే భూమి కొన్నవారు మరియు అమ్మిన వారు మరియు ఆ తేదిలోపు కొత్తగా భూమి రిజిస్టర్ చేసుకున్నవారు రైతు భందు పథకానికి దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం తెలిపింది. రైతులు వారి పూర్తి వివరాలతో అర్హులైన రైతులందరు తమ పేరు నమోదు చేసుకోవాలని ప్రభుత్వం తెలిపింది. ఇప్పటి వరకు రైతు భరోసా పొందని అర్హులైన రైతులు మరియు బ్యాంకు వివరాలు నమోదుచేయని రైతులందరు వెంటనే తమ వివరాలను నమోదు చేసుకోవాలని ప్రభుత్వం తెలిపింది.
Also Read: TGPSC Jobs: నియామక పత్రాలలో రికార్డు సృష్టించిని తెలంగాణ సర్కార్..!
1. కొత్తగా రైతు భరోసా అప్లికేషన్ ఫారం
2. పట్టా దారుని పాసుబుక్(PPB) కాపీ
3. ఆదార్ కార్డు
4. భూ పట్టాదారుణి బ్యాంక్ పాస్బుక్
5. ప్రస్థుతం బ్యాంకు లావాదేవీలకు వాడుతున్న సెలం నెంబర్
ఈ పైన తెలిపిన పత్రాలంన్నింటిని జమచేసి మండల కేద్రలో ఉన్న లేదా రైతువేదిక లోని వ్యవసాయ విస్తరణ అధికారికి (AEO) సమర్పిచాలి. అయితే ప్రభుత్వం వీటంన్నింటిని చేసుకొనుటకు 25-03-2026 తేదిని చివరి తేదిగా ప్రకటించింది. రైతులందరు ఈ తేదిలోపు తప్పకుండా తమ దరఖాస్తులను చివరి తేదిలోపు అందించాలని తెలిపింది.
తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అమలు చేసే కార్యక్రమాలలో ఇదో ముఖ్యమైన పథకంగా ప్రభుత్వం పేర్కోంటుంది. దీని ద్వారా రైతులకు పంటసాగుకు కొంత ఆర్థిక సహయం అందించేదుకు ఉపయోగపడుతుంది. రైతు భరోసా పథకం ద్వారా రైతులకు విత్తనాలు, ఎరువులు, పురుగులమందులు కొనుగోలు చేయడాని ఉపయోగపడుతాయి. మరియు రైతులకు పంట సాగులో నేరుగా ఆర్థిక సహయం అందించి వారి అబివృద్దికి తోడ్పాటు అందించేందుకు ప్రభుత్వం ఈ రైతు భందు పథకం అమలు చేస్తున్నది.
Also Read: New Schemes: తెలంగాణలో ఈ ఆర్థిక సంవత్సరం నుంచి.. మరో 9 నూతన పథకాలు