E-Paper
Advertisement

ప్రాజెక్టుని బొందపెట్టినోడే బాధపడ్డట్టు ఉంది.. బీఆర్ఎస్ నేతలపై సామా ఘాటు వ్యాఖ్యలు!

ప్రాజెక్టుని బొందపెట్టినోడే బాధపడ్డట్టు ఉంది.. బీఆర్ఎస్ నేతలపై సామా ఘాటు వ్యాఖ్యలు!

Sama Ram Mohan Reddy: స్వేచ్ఛ బ్యూరో: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు గురించి బీఆర్ఎస్ నేతలు మాట్లాడటం సిగ్గుచేటని మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు గురించి బీఆర్ఎస్ మాట్లాడటం అంటే ప్రాజెక్టుని బొందపెట్టినోడే బాధపడ్డట్టు ఉన్నదని విమర్శించారు.

2015 లోనే ఈ ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేస్తామని చెప్పిన కేసీఆర్ పదేళ్ల పాటు నిత్రపోయారా? అంటూ ప్రశ్నించారు. నీటి పారుదల ప్రాజెక్టుల పేరుతో వేల కోట్ల రూపాయలను దోచుకున్న బీఆర్ ఎస్ నాయకులు, సిగ్గులేకుండా మరోసారి తెలంగాణ ప్రజలను అబద్దాలతో ముంచనీకే తయారైయ్యారన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో 90 శాతం పనులు పూర్తయ్యాయని బీఆర్ ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు.

నార్లాపూర్ వద్ద ఏర్పాటు చేయాల్సిన 9 మోటార్లకు, పదేండ్లలో కేవలం ఒక్క మోటారు పెట్టి 90 శాతం పూర్తయిందని చెప్పడానికి సిగ్గు అనిపించట్లేదా?? అని సామా ఫైర్ అయ్యారు. పంపిణీ కాలువలుతవ్వకం పనులు అసలు చేపట్టకుండా రూ. 28 వేల కోట్లు ఎవరి జేబులో పోశారని ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టు కింద ఒక్క ఎకరానికి కూడా నీళ్లు రాలేదన్నారు. నకిలీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు బంద్ చేయాలని సూచించారు.

Also Read: కామారెడ్డి జిల్లాలో విషాదం.. మంజీరా నదిలో నలుగురు గల్లంతు!

Related News

బీహెచ్‌ఈఎల్ కార్మికుల పెన్నిధి.. ఎవరీ ‘జి. ఎల్లన్న’? హరీశ్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు!

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే.. అమీర్ పేట అగ్నిప్రమాదం.. బాధితులకు కవిత భరోసా

పేదింటి ఆడబిడ్డలకు గుడ్ న్యూస్.. మీ పేరు మీదే సొంత ఇల్లు, మంత్రి పొంగులేటి సంచలన ప్రకటన!

సింగరేణిలో రూ.1600 కోట్ల స్కామ్.. కిషన్ రెడ్డికి కేటీఆర్ లేఖ.. న్యాయ విచారణకు డిమాండ్

హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. 2,140 వాహనాలు సీజ్!

కమీషన్ల కోసమే ప్రాజెక్టులు.. రూ.వేల కోట్లు దోచేశారు.. బీఆర్ఎస్‌పై విరుచుకుపడ్డ సీఎం

‘జల హక్కులు కాపాడటంలో ప్రభుత్వం విఫలం’.. సీఎంకు హరీశ్ రావు బహిరంగ లేఖ

Big Stories

×