Sama Ram Mohan Reddy: స్వేచ్ఛ బ్యూరో: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు గురించి బీఆర్ఎస్ నేతలు మాట్లాడటం సిగ్గుచేటని మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు గురించి బీఆర్ఎస్ మాట్లాడటం అంటే ప్రాజెక్టుని బొందపెట్టినోడే బాధపడ్డట్టు ఉన్నదని విమర్శించారు.
2015 లోనే ఈ ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేస్తామని చెప్పిన కేసీఆర్ పదేళ్ల పాటు నిత్రపోయారా? అంటూ ప్రశ్నించారు. నీటి పారుదల ప్రాజెక్టుల పేరుతో వేల కోట్ల రూపాయలను దోచుకున్న బీఆర్ ఎస్ నాయకులు, సిగ్గులేకుండా మరోసారి తెలంగాణ ప్రజలను అబద్దాలతో ముంచనీకే తయారైయ్యారన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో 90 శాతం పనులు పూర్తయ్యాయని బీఆర్ ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు.
నార్లాపూర్ వద్ద ఏర్పాటు చేయాల్సిన 9 మోటార్లకు, పదేండ్లలో కేవలం ఒక్క మోటారు పెట్టి 90 శాతం పూర్తయిందని చెప్పడానికి సిగ్గు అనిపించట్లేదా?? అని సామా ఫైర్ అయ్యారు. పంపిణీ కాలువలుతవ్వకం పనులు అసలు చేపట్టకుండా రూ. 28 వేల కోట్లు ఎవరి జేబులో పోశారని ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టు కింద ఒక్క ఎకరానికి కూడా నీళ్లు రాలేదన్నారు. నకిలీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు బంద్ చేయాలని సూచించారు.
Also Read: కామారెడ్డి జిల్లాలో విషాదం.. మంజీరా నదిలో నలుగురు గల్లంతు!