Kamareddy: కామారెడ్డి జిల్లా పిట్లం మండల పరిధిలోని బొల్లక్పల్లి దగ్గర ఒక ఘోర విషాదం జరిగింది. సరదాగా గడుపుదామని మంజీరా నదిలో స్నానానికి దిగిన నలుగురు వ్యక్తులు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే గమనించిన స్థానికులు ఎలాగోలా శ్రమించి వారిలో ముగ్గురి మృతదేహాలను బయటకు తీశారు. మరోక వ్యక్తి కోసం గాలిస్తున్నారు.
ఈ లోగా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానిక ఈతగాళ్లు, రెస్క్యూ టీమ్ సహాయంతో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: అమెరికా టారిఫ్లు విధించినా తగ్గేదేలే.. ఆక్వా ఎగుమతుల్లో ఏపీ సరికొత్త రికార్డు!