E-Paper
Advertisement

Samagra Kutumba survey: నేటి నుండే స‌మ‌గ్ర‌ కుటుంబ స‌ర్వే.. ఈ ప‌త్రాలు ద‌గ్గ‌ర పెట్టుకోండి.. చివ‌రికి ఇది మ‌ర్చిపోవ‌ద్దు!

Samagra Kutumba survey: నేటి నుండే స‌మ‌గ్ర‌ కుటుంబ స‌ర్వే.. ఈ ప‌త్రాలు ద‌గ్గ‌ర పెట్టుకోండి.. చివ‌రికి ఇది మ‌ర్చిపోవ‌ద్దు!
Advertisement

Samagra Kutumba survey: రేవంత్ స‌ర్కార్ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌డుతున్న స‌మగ్ర కుటుంబ స‌ర్వే నేటి నుండే ప్రారంభం కానుంది. ఈ రోజు నుండి ఎన్యూమ‌రేట‌ర్లు ఇంటింటికి వెళ్లి పూర్తి కుటుంబ స‌భ్యుల వివ‌రాలను సేక‌రిస్తారు. ఇప్ప‌టికే మూడు రోజుల పాటు స్టిక్క‌రింగ్ ప్రాసెస్ పూర్తి చేశారు. స‌ర్వేకు సంబంధించిన వివ‌రాను సైతం ప్రాణాళిక శాఖ వెల్ల‌డించింది. ఇందులో భాగంగా కుల‌, సామాజిక‌, విద్య‌, ఉపాధి త‌దిత‌ర వివ‌రాలను అడిగి న‌మోదు చేసుకుంటారు. నిజానికి న‌వంబ‌ర్ 6 నుండి స‌ర్వే ప్రారంభం కావాల్సి ఉన్నప్ప‌టికీ మొద‌ట స్టిక్క‌రింగ్ చేశారు.

Also read: హైదరాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా ఆరు ట్రంప్ టవర్లు, వచ్చే ఏడాది ప్రారంభం..

Advertisement

ఈ నేప‌థ్యంలో అధికారికంగా నేటి నుండే స‌ర్వే ప్రారంభం కానుంది. స‌మ‌గ్ర కుటుంబ స‌ర్వే కోసం ఇత‌ర ప్రాంతాల్లో నివాసం ఉండేవారంతా స్వ‌గ్రామాల‌కు వెళ్లాలా వ‌ద్దా అనే దైల‌మాలో ఉన్నారు. దీంతో వారు ఉన్న‌చోటునే వివ‌రాల‌ను వెళ్ల‌డించాల‌ని ప్ర‌ణాళికశాఖ స్ప‌ష్టం చేసింది. ఆధార్ కార్డులో ఉన్న వివ‌రాల ఆధారంగానే స‌ర్వే జ‌రుగుతుంద‌ని తెలిపింది. అంతేకాకుండా ఎన్యూమ‌రేటర్లు ప్ర‌తి ఇంటికి వ‌స్తార‌ని వారు అడిగిన వివ‌రాలు చెబితే స‌రిపోతుందని చెప్పింది.

అయితే కొన్ని ముఖ్య‌మైన ప‌త్రాలు మాత్రం ద‌గ్గ‌ర పెట్టుకోవాల‌ని స‌ర్వే ప్ర‌ణాళిక శాక ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది. ముఖ్యంగా ఆధార్ కార్డు, రేష‌న్ కార్డు, పాస్ బుక్, సెల్ ఫోన్ నంబ‌ర్ల లాంటివి అందుబాటులో ఉంచాల‌ని సూచించింది. ఎన్యూమ‌రేట‌ర్లు వ‌చ్చే స‌మ‌యానికి ఇబ్బంది ప‌డ‌కుండా ముందుగానే కాగితాల‌ను సిద్దం చేసుకుంటే వివ‌రాలు కూడా సుల‌భంగా చెప్పొచ్చ‌ని స్ప‌ష్టం చేసింది. స‌ర్వే పూర్తి కాగానే కుటుంబ స‌భ్యులు అన్ని వివ‌రాలు స‌రైన‌వే అని ఒక సంత‌కం చేయాల్సి ఉంటుంది. ప్ర‌భుత్వం చేప‌డుతున్న ఈ స‌ర్వే ఆధారంగా కులాల వారిగా రిజర్వేష‌న్ల మార్పు, ప్ర‌భుత్వ ప‌థ‌కాలు ల‌బ్దిదారుల‌కే అంద‌జేత లాంటి కీల‌క నిర్ణ‌యాల‌ను ప్ర‌భుత్వం తీసుకునే అవ‌కాశం ఉంది.

Related News

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

Big Stories

Advertisement
×