E-Paper
Advertisement

Seethakka : బడుగు వర్గాల వారికి మంత్రి పదవి దక్కకూడదా?.. హరీష్ రావుపై సీతక్క ఫైర్

Seethakka : ములుగు ఎమ్మెల్యే , కాంగ్రెస్ నేత సీతక్క సోమవారం బీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ” నన్ను ఓడించేందుకు బీఆర్ఎస్ రూ.200 కోట్లు ఖర్చు చేస్తోంది. ములుగులో దొంగ నోట్లు కూడా పంచుతున్నారు. ఇక గ్రామాల్లో అయితే మద్యం ఏరులై పారుతోంది. ఇంకొకరైతే ‘సీతక్క మంత్రి అవుతుందట!’ అంటూ హేళనగా మాట్లాడారు. ఏ బడుగు బలహీనవర్గాల వారు మంత్రలు కాకూడదా? ఇంకా దొరల తెలంగాణ కావాలా?

Seethakka : బడుగు వర్గాల వారికి మంత్రి పదవి దక్కకూడదా?.. హరీష్ రావుపై సీతక్క ఫైర్

Seethakka : ములుగు ఎమ్మెల్యే , కాంగ్రెస్ నేత సీతక్క సోమవారం బీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ” నన్ను ఓడించేందుకు బీఆర్ఎస్ రూ.200 కోట్లు ఖర్చు చేస్తోంది. ములుగులో దొంగ నోట్లు కూడా పంచుతున్నారు. ఇక గ్రామాల్లో అయితే మద్యం ఏరులై పారుతోంది. ఇంకొకరైతే ‘సీతక్క మంత్రి అవుతుందట!’ అంటూ హేళనగా మాట్లాడారు. ఏ బడుగు బలహీనవర్గాల వారు మంత్రలు కాకూడదా? ఇంకా దొరల తెలంగాణ కావాలా? మనమంతా దొరల చేతిలో బందీలుగా బతుకుదామా?.. మనకు ఇల్లు, పోడు భూములకు పట్టాలు, పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వని బీఆర్ఎస్ నేతలు ప్రచారానికి ఇండ్ల కాడికి వస్తే వారిని తరిమి కొట్టండి” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అలాగే మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. “అగ్గిపెట్టె దొరకని హరీశ్ రావు ఇప్పుడు కారుకూతలు కూస్తున్నాడు.. ‘సీతక్క మంత్రి అవుతుందట!’ అని ఎద్దేవా చేస్తున్నాడు. ఏ.. నేను మంత్రిని కావొద్దా? నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవద్దా” అని నిలదీశారు. బడుగుబలహీన వర్గాలంటే బీఆర్ఎస్ నేతలకు చులకన అని సీతక్క ఆరోపణలు చేశారు.

ములుగులో తనకు ప్రత్యర్థి నాగజ్యోతి కాదని.. ఇక్కడ నుంచి నేరుగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు పోటీచేస్తున్నారని సీతక్క విమర్శలు చేశారు. తనను ఓడించడానికి నోట్ల కట్టలతో ప్రజలను కొనాలని చూస్తున్నారు కానీ ములుగు ప్రజలు అమ్ముడుపోరనే విషయం వారికి తెలియదన్నారు. బీఆర్ఎస్ నేతలు ఇచ్చే డబ్బులు తీసుకోవాలని ఓటర్లకు ఆమె సూచించారు. వాళ్లు పంచే డబ్బంతా గత పదేళ్లలో ప్రజల నుంచి దోచుకున్నదేనని చెప్పారు. వారిచ్చే డబ్బులు తీసుకుని ఓటు మాత్రం తనకే వేయాలని విజ్ఞప్తి చేశారు.

మండలంలోని కన్నాయిగూడెంలో సీతక్క ఎన్నికల ప్రచారం చేశారు. ప్రచారంలో భాగంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేసేందుకు కష్టపడుతున్న తనపై కేసీఆర్ ప్రభుత్వానికి ఎందుకు ఇంత కక్ష అని ప్రశ్నించారు. కరోనా కాలంలో ప్రజాసేవ చేసినందుకా? ప్రజల కష్టాల్లో పాలుపంచుకున్నందుకా?. ఎందుకు? అని నిలదీశారు. ప్రజల ఆశీర్వాదం ఉంటే.. తప్పకుండా మంత్రిని అవుతానని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ గెలుస్తే.. డబ్బులు గెలిచినట్టు.. అదే తాను గెలిస్తే ములుగు ప్రజలు గెలిచినట్టే అని సీతక్క వ్యాఖ్యానించారు.

Related News

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

Big Stories

×