Kalvakuntla Kavitha: నేడు మెదక్ జిల్లాలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రెస్ మీట్ నిర్వహించారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె బీఆర్ఎస్ పార్టీ నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా మాజీ మంత్రి టి. హరీష్ రావు, కేటీఆర్ పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ ఓడిపోవడానికి వాళ్లే కారణమంటూ విమర్శించారు. సోషల్ మీడియాలో ఉద్యమం తప్ప చేసిందేమీ లేదని కౌంటర్ వేశారు. కాంగ్రెస్ పార్టీ చేసినంత ప్రచారం కూడా బీఆర్ఎస్ చేయలేదన్నారు కవిత. ప్రజల సమస్యలను తెలుసుకోవడంలో వెనకబడ్డారంటూ బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు.
అంతేకాకుండా మెదక్ జిల్లా చుట్టు పక్కల ఉన్న సమస్యల గురించి ఆమె మాట్లాడారు. అయితే ఏడు పాయల అమ్మవారి ఆలయం సంవత్సరానికి 60 రోజులు మునిగిపోతుంది. ఆ ఆయకట్టు పెంచడానికి డబ్బులు శాంక్షన్ అయ్యాయి. కానీ, అప్పుడు ఉన్న ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు ఎందుకు పెంచలేదు అని ఆమె ప్రశ్నించారు.
Also Read: బీఆర్ఎస్ ఓటమి తర్వాత మాగంటి సునీత నివాసానికి వెళ్లిన కేటీఆర్
అలాగే కవిత డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అనర్హులకు ఇచ్చారు.. కానీ నిజమైన పేదవారికి ఇవ్వాలని ప్రభుత్వానికి తెలిపింది. అంతేకాకుండా మెదక్ జిల్లాలో ఒక పీజీ సెంటర్ కూడా లేదు.. విద్య సరిగ్గా లేదు.. యూనివర్సిటీ లేదు అని ఆమె ఆరోపించారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి, రైతుల కష్టాల గురించి, తెలంగాణ ఆడబిడ్డల గురించి మాట్లాడారు.