E-Paper
Advertisement

Sharmila : వర్షాలతో దెబ్బతిన్న పంటలు పరిశీలన.. షర్మిలకు అస్వస్థత..

Sharmila : వర్షాలతో దెబ్బతిన్న పంటలు పరిశీలన.. షర్మిలకు అస్వస్థత..
Advertisement

Sharmila : ఖమ్మం జిల్లా పర్యటనలో YSRTP అధ్యక్షురాలు షర్మిల అస్వస్థతకు గురయ్యారు. ఆమె మీడియాతో మాట్లాడుతుండగా తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. పక్కనున్న వారు వెంటనే అప్రమత్తమై.. ఆమెను కింద కూర్చోబెట్టారు. కొంచెం స్పృహలోకి వచ్చాక మంచినీళ్లు అందించారు. దీంతో షర్మిల తేరుకున్నారు.

ఖమ్మం జిల్లాలో అకాల వర్షాలకు పంట నష్టం జరిగిన ప్రాంతాల్లో షర్మిల పర్యటించారు. పొలాల్లోకి వెళ్లి.. దెబ్బతిన్న మొక్కజొన్న పంటను పరిశీలించారు. రైతులతో మాట్లాడి.. వారి సమస్యలు విన్నారు. అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయామని షర్మిలకు రైతులు చెప్పుకున్నారు.పెట్టుబడి కూడా రాక అప్పులపాలయ్యామని తెలిపారు.

Advertisement

పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో సీఎం కేసీఆర్ విఫలమయ్యారని షర్మిల మండిపడ్డారు. ఫసల్ బీమా అమలు చేయడం లేదని ఆరోపించారు. మార్చి నెలలో కురిసిన వర్షాలకు. .2 లక్షలకు పైగా ఎకరాల్లో పంట నష్టం జరిగిందని తెలిపారు. ఎకరానికి రూ. 10 వేల చొప్పున పరిహారం అందిస్తామని ప్రకటించిన కేసీఆర్ ఇప్పటికీ రైతులకు పరిహారం ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. కేసీఆర్ గాలి మోటార్ లో వచ్చి గాలి మాటలు చెప్పారని విమర్శించారు. ఏప్రిల్ 29న వరంగల్ జిల్లాలోనూ షర్మిల పర్యటించారు. రైతుల వద్దకు వెళ్లి పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు.

Related News

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

Big Stories

Advertisement
×