E-Paper
Advertisement

MLA Muthireddy : స్థల వివాదం.. ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి షాకిచ్చిన కూతురు..

MLA Muthireddy : స్థల వివాదం.. ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి షాకిచ్చిన కూతురు..
Advertisement

MLA Muthireddy : బీఆర్ఎస్ సీనియర్ నేత, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి ఆయన కూతురు తుల్జాభవాని షాకిచ్చారు. చేర్యాల మున్సిపాలిటీకి చెందిన చెరువు భూమిని కబ్జా చేశారని ఆయనపై ఆరోపణలున్నాయి. తన కూతురు తుల్జాభవాని పేరిట ఈ భూమిని రిజిస్ట్రేషన్ చేశారు. అయితే అక్రమ మార్గంలో తనకిచ్చిన భూమిని తిరిగి మున్సిపాలిటికి అప్పగిస్తున్నట్లు ఎమ్మెల్యే కూతురు తుల్జాభవాని ప్రకటించారు.

ఆదివారం చేర్యాల చెరువు వద్దకు ఆమె వెళ్లారు. తన పేరిట ఉన్న 21 గుంటల స్థలంలో బోర్డును ఏర్పాటు చేశారు. తన తండ్రి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి చేసిన పనికి ఆమె చేర్యాల ప్రజలకు క్షమాపణలు చెప్పారు.

Advertisement

గతంలో ఇదే భూమి కబ్జాకు గురైందని ఆరోపిస్తూ స్థానిక ప్రజలు, విపక్ష నాయకులు, ప్రజా సంఘాలు ఆందోళనలు నిర్వహించాయి. ప్రభుత్వం భూమిని కాపాడాలని డిమాండ్ చేశారు. అయితే అప్పట్లో కబ్జా విషయాన్ని అధికారులు లైట్ తీసుకున్నారనే విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు ఎమ్మెల్యే కూతురే స్వయంగా వచ్చి ఆ భూమిని మున్సిపాలిటీకి అప్పగిస్తున్నట్లు ప్రకటించారు.

Related News

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

ఎయిర్‌టెల్ 5G యూజర్లకు అలర్ట్.. హాట్‌స్పాట్ ఆన్ చేస్తే డేటా కట్ అంటూ ప్రచారం..!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

Big Stories

Advertisement
×