Kishan Reddy: గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, తప్పుడు విధానాల వల్లే సింగరేణి ఉద్యోగుల సంఖ్య 70 వేల నుండి 40 వేలకు పడిపోయిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. ఆదాయం గణనీయంగా తగ్గిన ఈ సమయంలో ‘తాడిచర్ల-II’ తో పాటు ‘నైనీ కోల్ బ్లాక్’ లో బొగ్గు ఉత్పత్తి ప్రారంభమయ్యేలా మోదీ సర్కార్ తీసుకున్న నిర్ణయం.. కొండంత భరోసా ఇచ్చిందన్నారు. తాడిచర్ల బొగ్గు గనులను సింగరేణికి కేంద్రం కేటాయించిన సందర్భంగా కొత్తగూడెం క్లబ్లో బీజేపీ నిర్వహించిన ‘భరోసా యాత్ర’ సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు.
20 ఏళ్లుగా కార్మికులు కోరుతున్న ఈ బ్లాక్ను ప్రధాని మోదీ.. సింగరేణి (SCCL)కి కేటాయించినట్లు చెప్పారు. దీని ద్వారా రాబోయే మూడు దశాబ్దాల వరకు బొగ్గు ఉత్పత్తికి ఢోకా ఉండదన్నారు. దాదాపు 11 ఏళ్ల తర్వాత ఎలాంటి ఆక్షన్ లేకుండా నేరుగా కేటాయించిన ఏకైక బ్లాక్ ‘తాడిచర్ల-2 అని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. గతంలో బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు సంస్థకు రావాల్సిన బాకాయిలు ఇవ్వకుండా ఆర్థిక సంక్షోభంలోకి సింగరేణిని నెట్టాయని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఈ రెండు ప్రభుత్వాలు సింగరేణిని ఏటీఎంలా వాడుకుని దాదాపు రూ.50 వేల కోట్లు బాకీపడ్డాయని చెప్పారు.
Also Read: ధర తక్కువ.. గాలి ఎక్కువ.. మార్కెట్లో దుమ్మురేపుతున్న స్టాండ్ ఫ్యాన్లు ఇవే!
మరోవైపు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు.. ఎన్. రామచందర్ రావు ఇదే కార్యక్రమంలో పాల్గొని అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు. రాబోయే రోజుల్లో వేలాది మంది సింగరేణి కార్మికుల భవిష్యత్తుకు భరోసా కల్పించనుందన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన కృషి ఫలితంగానే నైని, తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్లు ఎస్సీసీఎల్కు కేటాయించబడ్డాయని రాంచందర్ అన్నారు.
Also Read: వానకాలంలో కూలర్ మొరాయిస్తోందా? ఈ 5 చిట్కాలతో.. సూపర్ కూలింగ్ పక్కా!