Gaddam Vivek: కన్నెపల్లి పంప్ హౌస్ నుండి గోదావరి నీళ్లను పంపు చేయాలని కేటీఆర్ హరీష్ రావులు గగ్గోలు పెట్టడం వారి అవివేకానికి నిదర్శనమని మంత్రి గడ్డం వివేక్ అన్నారు. సోమవారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. చాలా రోజుల తర్వాత కేసీఆర్ ఫామ్ హౌస్ నుండి మనుమడి కోసం బయటకు వచ్చారన్నారు.
మా సీఎం రేవంత్ రెడ్డి చాలా సార్లు ప్రజా సమస్యల పై మాట్లాడాలని కోరాగా ప్రతి పక్ష లీడర్గా కేసీఆర్ ఏనాడు ఒక్క మాట మాట్లాడలేదన్నారు. కేటీఆర్, హరీష్ ఇద్దరు కన్నెపల్లి పంపు హౌస్ నుండి వాటర్ ని పంపు చేయాలని అంటున్నారు. పంపు చేయగలిగితే బ్యారేజ్లు ఎందుకు కట్టారనీ బీఆర్ఎస్లో ప్రశ్నించారు. కెసిఆర్ ఇంజనీర్ కాదనీ,
సెంట్రల్ కమిటీ రిపోర్ట్ ప్రకారమే బ్యారేజీలు నింపడం లేదన్నారు. కేటీఆర్, హరీష్ రావు రోజు పబ్లిసిటీ కోసం పాకులాడుతున్నారనీ ఎద్దేవా చేశారు. కవిత అడిగిన రూ.1400 కోట్లు ఎక్కడి నుండి వచ్చాయన్న దానికి వారు ప్రజలకు సమాధానం చెప్పాలనీ సూచించారు.
Also read: HILT Policy: హైదరాబాద్లో హిల్ట్ పాలసీ ఫెయిల్.. చిక్కుల్లో కాంగ్రెస్ సర్కార్..?
సిరిసిల్లలో ఇందిరమ్మ పథకం
కల్వకుంట్ల కుటుంబం ఆస్తులు, కమీషన్ల పరిపాలన జరిగిందన్నారు ఎలినేనో ప్రభావం తో వర్షాలు పడడం లేదనీ, రైతులకు ఏమి చేద్దామను ముందుకు రావాలని సూచించారు. సిరిసిల్లలో ఇందిరమ్మ పథకం ద్వారా కేటాయించిన 3500 ఇళ్లలో 2500 ఇళ్లు కట్టడం జరిగిందన్నారు. బి ఆర్ ఎస్ హాయంలో ఓట్ల కోసం డబుల్ బెడ్ రూమ్లు ఇస్తామని కాలం వెళ్ల దీశారనీ విమర్శించారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు పేదలకు ఇళ్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అన్నారు. ఐటీఐ ట్రైనింగ్ ఉన్నవారికి జర్మనీ టామ్ టామ్ సంస్థ ద్వారా, సిరిసిల్ల నుండి 100 మంది వరకు ఉద్యోగాలు కల్పిద్దామణి అని మంత్రి వివేక్ అన్నారు.
బ్యారేజీల్లో నీళ్లు నిలిపితే అవి కూలిపోయే ప్రమాదం ఉంది: మంత్రి వివేక్
బ్యారేజీల్లో మళ్లీ నీళ్లు నిలిపితే అవి కూలిపోయే ప్రమాదం ఉందని కేంద్ర ప్రభుత్వ సంస్థ నివేదిక ఇచ్చిందని మంత్రి వివేక్ తెలిపారు. నీటిని పంప్ చేయాలనుకుంటే ఢిల్లీకి వెళ్లి అనుమతి తేవాలని, కానీ బీఆర్ఎస్ నేతలు… pic.twitter.com/p6fOioQwAP
— BIG TV Breaking News (@bigtvtelugu) July 13, 2026
Also read: AP Job Calendar: ఏపీ నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. రెండోదశ జాబ్ క్యాలెండర్ పై సమీక్ష!