Shabad Murders: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో ఆరుగురిని అతి దారుణంగా హత్య చేసి పరారైన నిందితుడు రాజ్ కుమార్ మరణించాడు. స్థానికుల నుంచి అందిన సమాచారంతో పోలీసులు అతని మృతదేహాన్ని కొత్తూరు సమీపంలో కనుగొన్నారు. కొత్తూరు మండలం పంజర్ల పరిధిలోని ఒక ఓపెన్ వెంచర్లో రాజ్ కుమార్ శవమై కనిపించాడు. మృతదేహం పక్కనే పురుగుల మందు బాటిల్ లభ్యం కావడంతో, అతడు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
షాబాద్ 6 హత్యల కేసు నిందితుడి మరణంపై మృతురాలు బాలిక మేనమామ స్పందించారు. రాజ్ కుమార్ మృతి చెందినట్టు మీడియా ద్వారానే మాకు తెలిసిందని ఇంత వరకు మాకు తెలియచేయలేదని ఎవరు మాకు చెప్పలేదని అన్నారు. అతని మృతిని మేము మాకుంటుభం మాత్రమే కాదు యావత్ దేశమంతా కోరుకుంటుందని అన్నారు. ఇలాంటి దారునానికి పాల్చడిన వక్తి దేశంలో ఉన్నారా అని అందరు అనుకుంటున్నారని అన్నారు.
Also read: Amit Shah: హైదరాబాద్ టార్గెట్గా అమిత్ షా బిగ్ స్కెచ్.. ఢిల్లీలో బీజేపీ గల్లీ లీడర్ల పేర్లు!
ఆయన చనిపోవడంలో ఆశ్యర్యంలేదని ఇలా జరగాలని అందరూ కోరుకుంటున్నారని బాలిక మేనమామ అన్నారు. అతని మృతి వార్తవిని మాకు కొచెం నిమ్మలం అనిపించినా.. అంతకంటే ఎక్కువగా మాకుంటుంభాన్ని కోల్పోయామన్న భాదలోనే ఉన్నామని ఆయన అన్నారు. మాకు జరిగిన దారునానికి మేము కొన్న డిమాండ్లు చేస్తున్నామని అవి మోత్తం జిల్లా కలెక్టర్గారి దృష్టికి తీసుకెల్లామని అవి కూడా చేస్తే మాకు కొంచెం మనశ్శాంతి ఉంటుందని ఆయన అన్నారు. ప్రభుత్వం కొచెం లేటుగా స్పందించినప్పటికి చివరికి మాకు న్యాయం జరిగిందని అన్నారు.
షాబాద్ 6 హత్యల కేసు.. నిందితుడి మరణంపై బాలిక మేనమామ స్పందన#ShabadMurders #TelanganaCrime #JusticeForVictims https://t.co/CcphXWljtk pic.twitter.com/EHVw5mjCkb
— BIG TV Breaking News (@bigtvtelugu) July 13, 2026
Also read: AP Job Calendar: ఏపీ నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. రెండోదశ జాబ్ క్యాలెండర్ పై సమీక్ష!