E-Paper
Advertisement

హైదరాబాద్‌లో జపాన్ బృందం ప్రత్యక్షం.. తెలంగాణ యువత, రైతులకు అదిరిపోయే గుడ్ న్యూస్!

హైదరాబాద్‌లో జపాన్ బృందం ప్రత్యక్షం.. తెలంగాణ యువత, రైతులకు అదిరిపోయే గుడ్ న్యూస్!
Advertisement

Harish Babu: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ రాష్ట్రాన్ని పెట్టుబడుల స్వర్గధామంగా మార్చే దిశగా స్థానిక ప్రజాప్రతినిధులు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే, తాజాగా హైదరాబాద్ పర్యటనకు వచ్చిన జపాన్ దేశంలోని హిరోషిమాకు చెందిన ప్రజాప్రతినిధుల బృందంతో సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. శాసనమండలి కమిటీ హాల్‌ను సందర్శించిన ఈ విదేశీ ప్రతినిధులకు మన రాష్ట్రంలో ఉన్న అనుకూల వాతావరణాన్ని ఆయన వివరించారు.

శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ ప్రత్యేక సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ.. తెలంగాణలో జపాన్ సంస్థలు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని గుర్తుచేశారు. కేవలం పరిశ్రమల స్థాపనే కాకుండా, ఇక్కడి యువతకు ఉపాధి దొరికేలా నైపుణ్య శిక్షణ (స్కిల్ డెవలప్‌మెంట్) అందించాలని కోరారు.

Advertisement

ముఖ్యంగా అగ్రికల్చర్ టెక్నాలజీ (వ్యవసాయ సాంకేతికత), వైద్య రంగాల్లో రెండు దేశాల మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉంటే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. జపాన్ సాంకేతికత ఇక్కడి రైతులకు, వైద్య రంగానికి ఎంతో ప్లస్ అవుతుందని, దీనివల్ల పరస్పర సహకారం మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఈ చర్చలు మరిన్ని పెట్టుబడులకు దారితీస్తాయని భావిస్తున్నారు.

Related News

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

Big Stories

Advertisement
×