BigTV English
Advertisement

Ramanthapur: రామంతాపూర్ లో దారుణం.. తల్లిని చంపి.. గుట్టుచప్పుడు కాకుండా ?

Ramanthapur: రామంతాపూర్ లో దారుణం.. తల్లిని చంపి.. గుట్టుచప్పుడు కాకుండా ?

Ramanthapur : ఆస్తి కోసం తల్లిని హతమార్చాడు ఓ కొడుకు. ఈ దారుణం ఉప్పల్ పీఎస్ పరిధిలో గల రామంతాపూర్ లో చోటుచెసుకుంది. ఉప్పల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామంతాపూర్ లోని వెంకట్ రెడ్డి నగర్ లో కాసవేణి సుగుణమ్మ(65) అనే వృద్ధురాలు కొడుకు అనిల్, కోడలు తిరుమలతో కలిసి ఉంటోంది. అనిల్ అప్పులు చేసి.. ఏ పనీ చేయకుండా కాలం వెళ్లదీస్తున్నాడు.


ఈ నేపథ్యంలో సుగుణమ్మ పేరుపై ఉన్న ఇంటి కోసం తనతో గొడవపెట్టుకునేవాడు. వేధింపులు భరించలేక ఆమె 5 ఏళ్ల క్రితమే ఇంటిని కోడలి పేరున రిజిస్ట్రేషన్ చేసింది. ఈనెల 4న రాత్రి సుగుణమ్మ ఇంట్లో నిద్రపోయింది. అదే రాత్రి కొడుకు, కోడలు, మరో వ్యక్తి ఆమెను హత్యచేయాలని ప్లాన్ చేశారు. సుగుణమ్మ నిద్రలో ఉండగా దిండుతో ఊపిరి ఆడకుండా చేసి హత్య చేసారు. నిద్రలోనే చనిపోయినట్టు మరుసటి రోజు బంధువులకు సమాచారం ఇచ్చారు.

సాధారణ మరణంగా నమ్మించే ప్రయత్నం చేశారు . అంత్యక్రియల సమయంలో బంధువులు మృతదేహానికి స్నానం చేయిస్తుండగా మెడపై కమిలిపోయిన ఆనవాళ్లు కనిపించాయి. అనుమానంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహానికి శవ పరీక్ష చేయగా. శనివారం అసలు విషయం బయటపడింది. ముగ్గురిపై హత్యానేరం కింద కేసు నమోదు చేసిన ఉప్పల్ పోలీసులు.. వారిని అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు.


Related News

Road Accident: పెళ్లి కారు టైరు పేలి‌.. ముగ్గురు స్పాట్‌డెడ్‌

Road Accident: డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. మంటల్లో తగలబడి.. 8 మంది స్పాట్!

Patancheru Tollgate: ఘోర రోడ్డు ప్రమాదం.. పటాన్‌చెరులో ట్యాంకర్‌ బోల్తా..

Hyderabad News: హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్యాయత్నం.. అసలేం జరిగిందంటే..?

TMC MP Kalyan Banerjee: సైబర్ వలకు చిక్కిన ఎంపీ కళ్యాణ్ బెనర్జీ.. ₹55 లక్షల స్వాహా!

Tamil Nadu: చిన్నారి ప్రాణం తీసిన తల్లి.. మరో మహిళతో అఫైర్‌!

Nellore Accident: నెల్లూరులో స్కార్పియో యాక్సిడెంట్.. నలుగురు టీచర్లు స్పాట్!

Rajendranagar Accident: ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన డీసీఎం వాహనం..

Big Stories

×