E-Paper
Advertisement

Ramanthapur: రామంతాపూర్ లో దారుణం.. తల్లిని చంపి.. గుట్టుచప్పుడు కాకుండా ?

Ramanthapur: రామంతాపూర్ లో దారుణం.. తల్లిని చంపి.. గుట్టుచప్పుడు కాకుండా ?
Advertisement

Ramanthapur : ఆస్తి కోసం తల్లిని హతమార్చాడు ఓ కొడుకు. ఈ దారుణం ఉప్పల్ పీఎస్ పరిధిలో గల రామంతాపూర్ లో చోటుచెసుకుంది. ఉప్పల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామంతాపూర్ లోని వెంకట్ రెడ్డి నగర్ లో కాసవేణి సుగుణమ్మ(65) అనే వృద్ధురాలు కొడుకు అనిల్, కోడలు తిరుమలతో కలిసి ఉంటోంది. అనిల్ అప్పులు చేసి.. ఏ పనీ చేయకుండా కాలం వెళ్లదీస్తున్నాడు.

ఈ నేపథ్యంలో సుగుణమ్మ పేరుపై ఉన్న ఇంటి కోసం తనతో గొడవపెట్టుకునేవాడు. వేధింపులు భరించలేక ఆమె 5 ఏళ్ల క్రితమే ఇంటిని కోడలి పేరున రిజిస్ట్రేషన్ చేసింది. ఈనెల 4న రాత్రి సుగుణమ్మ ఇంట్లో నిద్రపోయింది. అదే రాత్రి కొడుకు, కోడలు, మరో వ్యక్తి ఆమెను హత్యచేయాలని ప్లాన్ చేశారు. సుగుణమ్మ నిద్రలో ఉండగా దిండుతో ఊపిరి ఆడకుండా చేసి హత్య చేసారు. నిద్రలోనే చనిపోయినట్టు మరుసటి రోజు బంధువులకు సమాచారం ఇచ్చారు.

Advertisement

సాధారణ మరణంగా నమ్మించే ప్రయత్నం చేశారు . అంత్యక్రియల సమయంలో బంధువులు మృతదేహానికి స్నానం చేయిస్తుండగా మెడపై కమిలిపోయిన ఆనవాళ్లు కనిపించాయి. అనుమానంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహానికి శవ పరీక్ష చేయగా. శనివారం అసలు విషయం బయటపడింది. ముగ్గురిపై హత్యానేరం కింద కేసు నమోదు చేసిన ఉప్పల్ పోలీసులు.. వారిని అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు.

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×