E-Paper
Advertisement

Sonia Gandhi: రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు దూరంగా సోనియా గాంధీ ? ఎందుకంటే..

Sonia Gandhi: రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు దూరంగా సోనియా గాంధీ ? ఎందుకంటే..
Advertisement

Sonia Gandhi Telangana Tour: రాష్ట్ర అవతరణ వేడుకలకు సోనియా గాంధీ వచ్చే అవకాశం లేనట్లు తెలుస్తోంది. ఆరోగ్య సమస్యల కారణంగా సోనియా గాంధీ రాలేకపోవచ్చని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. మే 28న ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి సోనియా గాంధీని వేడుకలకు రావాలని ఆహ్వానించారు.

ఏఐసీసీ సోనియా గాంధీ ఆవిర్భావ వేడుకలకు హాజరవుతారని తెలిపింది. అంతలోనే వేడుకలకు సోనియా  రావడం లేదంటూ కాంగ్రెస్ వర్గాల నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే రాష్ట్ర వేడుకలకు విద్యావేత్తలు, ఉద్యమకారులతో పాటు వివిధ వర్గాల వారికి ఆహ్వానం అందించారు. జూన్ 2న జరిగే ఆవిర్భావ వేడుకలకు ప్రభుత్వం ఏర్పాట్లను పూర్తి చేసింది.

Advertisement

ఈ నేపథ్యంలోనే చార్మినార్, ట్యాంక్ బండ్, సచివాలయం, అమర జ్యోతి స్థూపం, గోల్కొండ తో పాటు వివిధ పర్యాటక ప్రాంతాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఆయా ప్రాంతాల్లో కట్టుదిట్టమై భద్రతా ఏర్పాట్లను చేయగా.. సీఎస్ శాంత కుమారి దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Also Read: గవర్నర్‌ను కలిసిన సీఎం రేవంత్.. దశాబ్ది వేడుకలకు ఆహ్వానం

Advertisement

తెలంగాణ ఆవిర్బావ వేడుకల సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రభుత్వంతో పాటు బీఆర్ఎస్ కూడా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలోనే ట్యాంక్ బండ్,సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ ప్రాంతాల్లో పలు కార్యక్రమాలను నిర్వహించనున్నారు. దీంతో శనివారం అర్థరాత్రి నుంచి ఆదివారం అర్థరాత్రి వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని.. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని అధికారులు సూచించారు.

Related News

కొండా‌ సురేఖ ఆసక్తికర పోస్టు.. త్వరలో భారీ అప్‌డేట్, అసలు మేటరేంటి?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

Big Stories

Advertisement
×