E-Paper
Advertisement

Rajiv Gandhi Statue: సచివాలయంలోని రాజీవ్ గాంధీ విగ్రహ ప్రత్యేకత ఏమిటీ?

Rajiv Gandhi Statue: సచివాలయంలోని రాజీవ్ గాంధీ విగ్రహ ప్రత్యేకత ఏమిటీ?
Advertisement

Telangana: రాష్ట్ర సచివాలయం ముందు రాష్ట్ర ప్రభుత్వం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దేశంలో ఎక్కడా లేని రూపంలో ఈ విగ్రహం ఉండాలని ప్రభుత్వం భావించింది. అందుకోసం దేశంలోని రాజీవ్ విగ్రహాలను అన్నింటిని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. దేశంలోని విగ్రహాలు అన్నింటిని పరిశీలించిన తర్వాత ఒక రూపాన్ని డిసైడ్ చేశారు. ప్రస్తుతం సచివాలయం ఎదుట ఉన్న చెక్కిన రాజీవ్ గాంధీ విగ్రహానికి ప్రత్యేకత ఉన్నది.

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఏ కార్యక్రమానికి వెళ్లినా.. పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు ఎంతో ఆదర అభిమానాలు చూపించేవారు. ఎదురు వచ్చి పూలమాలలు వేసి తమ అభిమానాన్ని చాటుకునేవారు. వేదిక పైనా ఆయనకు పూలమాలలు వేసి సత్కరించేవారు. కానీ, రాజీవ్ గాంధీ ఆ పూలమాలలను మెడలో ఉంచుకునేవారు కాదు. ప్రజలు చూపించిన ఆ అభిమానాన్ని తిరిగి వారిపైనా కురిపించేవారు. ఇందులో భాగంగా ఆయన ఆ పూల మాలలను తిరిగి అభిమానులు, ప్రజలపైనకు విసిరేసేవారు.

Advertisement

Also Read: Chiranjeevi: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన చిరంజీవి – వరద బాధితులకు రూ.50 లక్షలు విరాళం

ఈ విషయాన్ని ప్రధానం చేస్తూ రాష్ట్ర సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహం కూడా పూలమాలను ఎదుటి వారి మెడలో పడే విధంగా విసిరేస్తున్నట్టుగా ఉన్నది. ఇలాంటి విగ్రహం ప్రస్తుతం దేశంలో ఎక్కడా లేదు. రాష్ట్ర సచివాలయం ముందు ఎక్కడా లేని రూపంలో రాజీవ్ గాంధీ విగ్రహం రూపంలో దర్శనమిస్తున్నారు.

Advertisement

విగ్రహాన్ని ముట్టుకుంటే ప్రజలే సమాధానమిస్తారు

మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ వీ హనుమంతరావు గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం సచివాలయం ముందు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెడుతున్నదని వివరించారు. రాజీవ్ గాంధీ దేశాన్ని 21వ శతాబ్దానికి తీసుకువచ్చిన మహా నాయకుడని పేర్కొన్నారు. అలాంటి నాయకుడి విగ్రహాన్ని కూలగొడతామని, తరలిస్తామని బీఆర్ఎస్ నేతలు మాట్లాడటం సరికాదని తెలిపారు. ఏదైనా అవాంఛనీయ ఘటనలు ఒకవేళ జరిగితే అది బీఆర్ఎస్ పార్టీకి పెద్ద నష్టాన్ని తెచ్చిపెడుతాయని హెచ్చరించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఫ్యామిలీ రాజీవ్ గాంధీ గారిదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిందే సోనియా గాంధీ అని, అలాంటప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెడితే తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతింటుందని మాట్లాడటంలో అర్థమే లేదని రివర్స్ కౌంటర్ ఇచ్చారు. రాజీవ్ గాంధీ విగ్రహం అక్కడే ప్రతిష్టించాలని, విగ్రహాన్ని ముట్టుకుంటే ప్రజలే సమాధానం చెబుతారని వార్నింగ్ ఇచ్చారు. అలాంటి ఆలోచనలు ఉంటే బీఆర్ఎస్ నాయకులు విరమించుకోవాలని హితవు పలికారు. దేశంలో సాంకేతిక విప్లవం, మహిళలకు రిజర్వేషన్లు, ఓటు హక్కు 18 ఏళ్ల వారికే ఉండాలనే కీలకమైన నిర్ణయాలు ఆయన ద్వారానే సాధ్యమయ్యాయని తెలిపారు. దేశాన్ని ప్రగతి పథంలో.. ప్రపంచ దేశాలతో పోటీ పడేలా చేసిన మహా నేత.. రాజీవ్ గాంధీ అని వీహెచ్ పునరుద్ఘాటించారు.

Related News

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×