E-Paper
Advertisement

Summer : భానుడి ప్రతాపం.. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచేస్తున్నాయ్..

Summer  : భానుడి ప్రతాపం.. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచేస్తున్నాయ్..
Advertisement

Summer in Telugu States (AP & TS News) : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. ఏపీలో చాలా ప్రాంతాల్లో ఉష్టోగ్రతలు 40 డిగ్రీలు దాటేశాయి. రాష్ట్రంలో కొన్నిరోజులుగా ఎండల తీవ్రత పెరిగింది. పలు ప్రాంతాల్లో సోమవారం ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కంటె ఎక్కువగా నమోదయ్యాయి. 119 కేంద్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు గుర్తించారు. సాధారణ ఉష్ణోగ్రతల కంటె సగటున రెండు డిగ్రీల పెరిగినట్లు వాతావరణ శాఖాధికారులు తెలిపారు.

అత్యధికంగా రెంటచింతలలో 42.8 డిగ్రీల గరిష్ట ఉష్టోగ్రత నమోదైంది. కర్నూలులో 41.5, రాజమండ్రిలో 40.5 డిగ్రీల ఉష్టోగ్రతలు నమోదయ్యాయి. వారం రోజులపాటు వేడి వాతావరణం ఉంటుందని, ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణశాఖ ప్రకటించింది. మంగళవారం 26 మండలాల్లో వడగాల్పులు వీచే అవ­కాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అడ్డ­తీగల, నెల్లిపాక, చింతూరు, గంగవరం, రాజ­వొ­మ్మంగి, వరరామచంద్రపురం, కోటవురట్ల, మాకవరపాలెం, నర్సీపట్నం మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపింది.

Advertisement

రోహిణి కార్తీలో ఎండలకు రోళ్లు పగులుతాయంటారు. కానీ కర్నూలు జిల్లా గోనెగండ్లలో ఏప్రిల్ నెలలోనే ఎండలకు బండ రాయి పగలడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామంలోని నరసప్ప దేవాలయం వద్ద ఉన్న పెద్ద బండరాయి పగిలింది. పగిలి బండరాయిపై మరో బండరాయి ఉండటంతో ఎక్కడ పడిపోతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. రెవెన్యూ, పోలీసు అధికారులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.

తెలంగాణలోనూ ఎండల తీవ్రత క్రమంగా పెరిగింది. సోమవారం ఆదిలాబాద్‌ జిల్లాలో 40.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాబోయే 4 రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

Advertisement

సోమవారం మహబూబ్‌నగర్‌ లో 39.8, నల్లగొండలో 39.5, నిజామాబాద్‌లో 39, రామగుండలో 39, ఖమ్మంలో 39, భద్రాచలంలో 38.6, మెదక్‌ లో 38.2, హనుమకొండలో 36.5, హైదరాబాద్‌ లో 36 డిగ్రీల సెల్సియస్‌ గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మంగళవారం ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశముంది.

స్కూల్​కు వెళ్లే విద్యార్ధులు ఎండ వేడికి ఇబ్బందులు పడుతూ ఇంటికి చేరుకుంటున్నారు. వాహనాలపై వెళ్లే ప్రయాణికులు చెట్ల నీడ కింద ఆగి మరీ సేద తీర్చుకుంటున్నారు. ఏప్రిల్ నెల మొదటిలోనే ఎండలు ఇంతలా మండుతున్నాయి అంటే.. మే నాటికి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Related News

హైదరాబాద్ సిటీవాసులకు బిగ్ అలర్ట్.. మంగళవారం వరకు ట్రాఫిక్ ఆంక్షలు, ఏయే ఏరియాల్లో

టెక్కీ మృతి కేసులో సంచలన విషయాలు.. అనుక్షణం వెంటాడిన ఆ భయం.. తట్టుకోలేక అర్ధరాత్రి వేళ..

విమాన రంగానికి కొత్త కష్టాలు.. విమానాలపై లేజర్ దాడులు, శంషాబాద్ ఎయిర్‌పోర్టు నాలుగో స్థానం

ORRపై ఘోర విషాదం.. భారీ వర్షం తెచ్చిన ప్రమాదం.. రెండు కార్లు నుజ్జునుజ్జు, ఇద్దరు మృతి

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Big Stories

Advertisement
×