Environmental: దేశంలో సాధారణంగా ఏదైనా ప్రాజెక్ట్ ప్రారంభించే ముందే పర్యావరణ అనుమతులు తీసుకోవడం తప్పనిసరి. అయితే కొన్ని సమయాల్లో అనుమతులు లేకుండా నిర్మాణాలు ప్రారంభించిన ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆఫీస్ మెమోరాండమ్ల ద్వారా తర్వాతి కాలంలో ప్రభుత్వం అనుమతులు మంజూరు చేస్తుంది. ప్రాజెక్టుల పర్యావరణ అనుమతుల విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పుఇచ్చింది.
ఫాస్ట్ ఫ్యాక్టో పర్యావరణ అనుమతుల కోసం ఆఫీస్ మెమోరాండం సరిపోదని కోర్టు తెలిపింది. దీనికోసం ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వాల్సిందేనన్న సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. చట్టబద్ధ నోటిఫికేషన్ ద్వారా అవసరమైతే పోస్ట్-ఫాక్టో (తర్వాతి దశలో) పర్యావరణ అనుమతులు ఇచ్చే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది.
Also Read: చంద్ర బాబు పాలనపై అంబటి పంచ్లు.. ఆయన వస్తే వర్షాలు రావట!
అయితే ఈ విధానాన్ని అమలు చేసేందుకు కేంద్రం జారీ చేసిన 2021 ఆఫీస్ మెమోరాండమ్ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఇటువంటి అనుమతుల కోసం కేవలం ఆఫీస్ మెమోరాండమ్ సరిపోదని, చట్టబద్ధ నోటిఫికేషన్ ద్వారానే అనుమతులు ఇవ్వాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పుతో భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం చట్టపరమైన నోటిఫికేషన్ జారీ చేసి పోస్ట్-ఫాక్టో పర్యావరణ అనుమతుల వ్యవస్థను అమలు చేసే అవకాశం ఉందని తెలిపింది. దీనికోసం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
Also Read: పార్టీలో వ్యక్తిగత ఎజెండాలు సాగవు.. టీడీపీ నేతలకు మంత్రి నిమ్మల వార్నింగ్!