SVR Grandson: ప్రముఖ నటుడు ఎస్వీ రంగారావు మనవడు రంగారావు సంచలన ఆరోపణలు చేశారు. ఫోర్జరీ సంతకాలతో ఎస్వీఆర్ భూమిని కబ్జా చేశారని ఆరోపించారు. న్యాయం చేయాలంటూ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. మాసబ్ ట్యాంక్ శాంతినగర్లో 446 చదరపు అడుగుల స్థలాన్ని 1966లో తమ తాత ఎస్వీ రంగారావు కొనుగోలు చేశారని ఆయన మనవడు తెలిపారు. ఆ స్థలంలో నిర్మించిన ఇంటిని శ్రీనివాస్ అనే వ్యక్తి లీజుకు తీసుకున్నారన్నారు.
నమ్మకంగా ఉంటూ తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా శ్రీనివాస్, 2007లో తమ సంతకాలను ఫోర్జరీ చేసి ఇంటిని స్వాధీనం చేసుకున్నారని రంగారావు ఆరోపించారు. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. కోర్టు తమకు అనుకూలంగా ఆదేశాలు జారీ చేసిందన్నారు. ప్రభుత్వం విచారణ జరిపించి న్యాయం చేయాలని కోరిన రంగారావు కోరారు.
మాసబ్ ట్యాంక్ శాంతినగర్లోని 446 చదరపు అడుగుల స్థలాన్ని 1966లో ఎస్.వి రంగారావు కొనుగోలు చేశారని, 1995లో ఆ ఇంటిని శ్రీనివాస్ అనే వ్యక్తికి లీజుకు ఇచ్చామని ఎస్వీఆర్ మనవడు తెలిపారు. అయితే, శ్రీనివాస్ తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, 2007లో ఫోర్జరీ సంతకాలతో ఆ ఇంటిని అక్రమంగా తన స్వాధీనంలోకి తీసుకున్నారని రంగారావు ఆరోపించారు. ఈ విషయంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. నిర్మాణాలు చేపట్టకూడదని కోర్టు ఆదేశాలు ఇచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని కోరారు రంగారావు.