E-Paper
Advertisement

Muduchintalapalli Municipality: పన్నుల గణాంకాల్లో స్పష్టత లోపం.. ఆన్‌లైన్ లో ఒక లెక్క.. అధికారుల దగ్గర మరో లెక్క!

Muduchintalapalli Municipality: పన్నుల గణాంకాల్లో స్పష్టత లోపం.. ఆన్‌లైన్ లో ఒక లెక్క.. అధికారుల దగ్గర మరో లెక్క!
Advertisement

Muduchintalapalli Municipality: స్వేచ్ఛ, బ్యూరో:  మూడుచింతలపల్లి మున్సిపాలిటీలో పన్నుల గణాంకాల విషయంలో స్పష్టత లోపం కనిపిస్తోంది. ఆన్‌లైన్‌లో నమోదైన వివరాలు, అధికారుల లెక్కలు పరస్పరం భిన్నంగా ఉండటం గమనార్హం. ఆన్‌లైన్ నమోదు ప్రకారం పన్నుల మొత్తం డిమాండ్ రూ.2.81 కోట్లు కాగా, ఇప్పటివరకు రూ.1.39 కోట్లు వసూలైనట్లు సమాచారం. దీని ప్రకారం సుమారు 49.67 శాతం వసూళ్లు జరిగినట్లు తెలుస్తోంది. అయితే మున్సిపల్ రెవెన్యూ అధికారి అర్షద్ వివరాల ప్రకారం డిమాండ్ రూ.3.30 లక్షలు, వసూళ్లు రూ.3.05 లక్షలు ఉండి దాదాపు 90 శాతం వసూలు పూర్తయ్యిందని తెలిపారు.ఈ రెండు లెక్కల మధ్య వ్యత్యాసం స్థానికుల్లో సందేహాలకు దారి తీస్తోంది. కోట్లలో ఉన్న డిమాండ్, లక్షల స్థాయిలో చూపించడంపై ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

Also Read: Khammam Farmers: బడ్జెట్ లో సీతారామ ప్రాజెక్టుకు అవసరమైన నిధులు కేటాయించాలి.. ఆ జిల్లాలో రైతుల భారీ నిరసన

ఆన్‌లైన్‌లో రూ.2.81 కోట్లు

Advertisement

మున్సిపాలిటీగా మారకముందు మండలంగా ఉన్న సమయంలో పన్నుల డిమాండ్ రూ.3 కోట్లకు పైగానే ఉండేదని స్థానికులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో రూ.2.81 కోట్లుగా నమోదు కావడం గమనార్హంగా మారింది. ఇంకా సుమారు వెయ్యికి పైగా ఆస్తుల డిమాండ్ ఆన్‌లైన్‌లో నమోదు కాలేదని మున్సిపల్ రెవెన్యూ అధికారి అర్షద్ వెల్లడిస్తున్నారు. సాంకేతిక సమస్యల కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందని వివరణ ఇస్తున్నారు. కానీ గత గ్రామ పంచాయతీ కాలంలో ఈ పంచాయతీ పోర్టల్ ద్వారా ఆస్తి పన్ను వివరములు అన్ని కూడా నమోదు చేయడం జరిగిందని అప్పటి అధికారులు తెలియజేశారు. అయితే వాటిలో కొన్ని ఆస్తుల నుంచి పన్నులు వసూలు చేసినట్లు సమాచారం అందుతోంది కానీ, అప్పటిలో గ్రామ పంచాయతీ కాలంలో పన్నులు చెల్లించిన వారికి రసీదు ఇచ్చినప్పటికీ ప్రస్తుత ఆన్లైన్ డిమాండ్ లో బాకీలు ఉన్నట్లుగా చూస్తున్నాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, పన్నుల గణాంకాల పై పూర్తి స్పష్టత తీసుకురావాలని, వివరాలను ప్రజలకు వెల్లడించాలని స్థానికులు కోరుతున్నారు.

Also Read:Maganti Gopinath Daughter Accident: మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కుటుంబంలో విషాదం: ఓఆర్ఆర్‌పై కుమార్తెల కారు ప్రమాదం!

Related News

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

కుషాయిగూడ పీహెచ్‌సీలో ఊహించని పరిణామం.. డాక్టర్‌గా మారిన డీఎంహెచ్‌ఓ!

Big Stories

Advertisement
×