E-Paper
Advertisement

Telangana Cabinet: సౌదీ బస్సు ప్రమాద బాధితులకు రూ. 5 లక్షల పరిహారం.. అక్కడికే ప్రభుత్వ ప్రతినిధి బృందం

Telangana Cabinet: సౌదీ బస్సు ప్రమాద బాధితులకు రూ. 5 లక్షల పరిహారం.. అక్కడికే ప్రభుత్వ ప్రతినిధి బృందం
Advertisement

Telangana Cabinet: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం ప్రారంభమైన తెలంగాణ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇటీవల సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో మరణించిన తెలంగాణ వాసుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం (ఎక్స్‌గ్రేషియా) అందించాలని మంత్రివర్గం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. బాధితుల కుటుంబాలను ఆదుకునేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది.

ఈ ప్రమాదానికి సంబంధించి తదుపరి సహాయక చర్యల నిమిత్తం, సౌదీ అరేబియాకు తక్షణమే ప్రభుత్వ ప్రతినిధి బృందాన్ని పంపాలని కేబినెట్ తీర్మానించింది. ఈ బృందంలో మంత్రి అజారుద్దీన్, ఎంఐఎం ఎమ్మెల్యే, మైనారిటీ విభాగానికి చెందిన ఒక సీనియర్ అధికారి ఉంటారు. ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలకు, వారి మత సంప్రదాయాల ప్రకారం సౌదీ అరేబియాలోనే అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకుగాను, బాధిత కుటుంబాల నుంచి ఒక్కో కుటుంబానికి ఇద్దరు సభ్యులను ప్రభుత్వ ఖర్చులతో అక్కడికి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.

Advertisement

అంతకుముందు, కేబినెట్ సమావేశం ప్రారంభంలో ప్రముఖ కవి, తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ మృతి పట్ల మంత్రివర్గం సంతాపం తెలిపింది. ఆయన సేవలను స్మరించుకుంది. అందెశ్రీ జ్ఞాపకార్థం ‘స్మృతి వనం’ ఏర్పాటు చేయడంతో పాటు, ఆయన కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించే అంశంపై కూడా కేబినెట్ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

Related News

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

మేడ్చల్‌లో పార్కింగ్ రగడ కలకలం.. హెచ్చరికలు జారీ చేసిన సీఐ క్రాంతి కుమార్!

తెలంగాణలో కొత్త పింఛన్‌‌దారులకు బిగ్ రిలీఫ్.. ఆ విషయంపై క్లారిటీ!

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×