E-Paper
Advertisement

CM Revanth Reddy Meeting: 100 రోజుల పాలనకు లోక్‌సభ ఎన్నికలు రెఫరెండం.. టార్గెట్ 14 ఎంపీ సీట్లు!

CM Revanth Reddy Meeting: 100 రోజుల పాలనకు లోక్‌సభ ఎన్నికలు రెఫరెండం.. టార్గెట్ 14 ఎంపీ సీట్లు!
Advertisement
CM Revanth Reddy
CM Revanth Reddy

CM Revanth Reddy Chevella Parliament Constituency: తెలంగాణలో 14 ఎంపీ సీట్లు గెలవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలకు పదునుపెడుతోంది. తుక్కుగూడ రాజీవ్ గాంధీ ప్రాంగణంలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించింది. జనజాతర పేరుతో నిర్వహించే ఈ సభలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. తుక్కుగూడ బహిరంగ సభ ద్వారా ఎన్నికల శంఖారావాన్ని పూరించాలని కాంగ్రెస్ భావిస్తోంది.

మరోవైపు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా బలాబలాలపైనే కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే మాల్కాజ్ గిరి లోక్ సభ నియోజకవర్గ క్యాంపు ఆఫీస్ లో చేవెళ్ల నియోజకవర్గ నాయకులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల లోక్ సభ అభ్యర్థి రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన నేతలు ఈ భేటీకి హాజరయ్యారు.

Advertisement

తెలంగాణలో 14 ఎంపీ సీట్లు గెలవాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ఎన్నికలను రాష్ట్రంలో కాంగ్రెస్ 100 రోజుల పాలనకు రెఫరెండంగా తీసుకోవాలన్నారు. అన్నివర్గాలకు కాంగ్రెస్ తోనే సామాజిక న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. సర్వేల ఆధారంగానే ఎంపీ అభ్యర్థులను ఎంపిక చేస్తున్నామని క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయం సేకరించామని తెలిపారు.

Also Read: బీఆర్ఎస్‌కు మరో షాక్, నావల్ల కావడం లేదంటున్న ఆ నేత !

Advertisement

సర్వేల ఆధారంగానే చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా రంజిత్‌రెడ్డి, మల్కాజ్ గిరి ఎంపీ అభ్యర్థిగా సునీతా మహేందర్‌రెడ్డి, సికింద్రాబాద్‌ ఎంపీ అభ్యర్థిగా దానం నాగేందర్‌ ను కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసిందని రేవంత్ రెడ్డి చెప్పారు.

Related News

ఈసారి దక్షిణాది వంతు.. వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు, హైదరాబాద్‌లో అయితే..

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

Big Stories

Advertisement
×