E-Paper
Advertisement

Delhi: ఢిల్లీలో పలకరింపులు.. సీఎం రేవంత్‌రెడ్డికి ఎదురుపడ్డ మాజీ మంత్రి రోజా, హస్తినలో ఏం పని?

Delhi: ఢిల్లీలో పలకరింపులు.. సీఎం రేవంత్‌రెడ్డికి ఎదురుపడ్డ మాజీ మంత్రి రోజా, హస్తినలో ఏం పని?
Advertisement

Delhi:ఢిల్లీలో టూర్‌లో సీఎం రేవంత్‌రెడ్డి బిజీగా ఉన్నారు. పార్టీ అగ్రనేతలతో సమావేశమయ్యారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం కేంద్రమంత్రులను కలిశారు. అదే సమయంలో వైసీపీ నేత, మాజీ మంత్రి రోజా ఎదురుపడ్డారు. దీంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి షేక్ హ్యాండ్ ఇచ్చారు రోజా. ఇంతకీ రోజా ఢిల్లీకి ఎందుకు వెళ్లినట్టు? అంటూ టీడీపీలో చర్చ మొదలైంది.

ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డికి ఎదురుపడ్డ మాజీ మంత్రి రోజా

Advertisement

ఢిల్లీలో ఎదురెదురు పడ్డారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి- ఏపీ మాజీ మంత్రి రోజా. ఈ సందర్భంగా ఒకరిని నొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. ఆప్యాయంగా పలకరించుకున్నారు. బుధవారం ఉదయం కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసేందుకు రోజా పార్లమెంటు భవనానికి వచ్చారు.

అదే సమయంలో ఇరువురు తారసపడ్డారు. సీఎంను పలకరించారు రోజా. రేవంత్‌రెడ్డితో వెంట నాయకులు ఆమెని ఏదో ప్రశ్నించారు. పని మీద వచ్చానని ఆమె సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డిని రోజా పలకరించారు.

Advertisement

గడ్కరీతో రోజా సమావేశం.. టీడీపీ నేతల ఆరా

ఇంతకీ ఢిల్లీకి మాజీ మంత్రి రోజా ఎందుకు వెళ్లినట్టు? ఈ టూర్ వెనుక ఏమైనా కారణాలు ఉన్నాయా? వైసీపీ వ్యవహారాలను తెర వెనుక ఆమె చక్కబెడుతున్నారా? హస్తినలో రోజా ఉన్న విషయం తెలియగానే టీడీపీ నేతలు అలర్ట్ అయ్యారు. ఆమె పర్యటన గురించి ఆరా తీసినట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై వైసీపీ వెర్షన్ మరోలా ఉంది.

రోజా నియోజకవర్గం నగరిలో 600 ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయం ఉంది. దాన్ని పరిరక్షించాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసి విజ్ఞప్తి చేశారు. హిస్టరీకి సంబంధించిన వ్యవహారాలను టూరిజం శాఖ చూస్తుందని అంటున్నారు టీడీపీ నేతలు. ఆ శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, లేదంటే సహాయమంత్రి సురేష్ గోపి కలవాలని అంటున్నారు. మంత్రి గడ్కరీని రోజా కలవడం వెనుక ఏదో జరుగుతోందని చర్చ అప్పుడే మొదలైంది.

ALSO READ: ఇందుకేనా ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓటేసింది?

 

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×