E-Paper
Advertisement

Amaravati News: తాడేపల్లిలో రాజగోపాల్‌రెడ్డి బస.. జగన్‌తో భేటీ? అసలు మేటరేంటి?

Amaravati News: తాడేపల్లిలో రాజగోపాల్‌రెడ్డి బస.. జగన్‌తో భేటీ? అసలు మేటరేంటి?

Amaravati News: రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు ఉండరు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఎవరు.. ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి. మంత్రి పదవి రాలేదని కొన్నాళ్లుగా కాంగ్రెస్ అధిష్టానంపై కారాలు మిరియాలు నూరుతున్నారు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి. తాజాగా ఆయన ఏపీ మాజీ సీఎం జగన్‌తో భేటీ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ మాటరేంటి?

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మళ్లీ వార్తల్లోకి వచ్చారు. మంత్రి పదవి ఇవ్వనందుకు కాంగ్రెస్ హైకమాండ్‌పై ఆయన ఆగ్రహంగా ఉన్నారు. సమయం, సందర్భం వచ్చినప్పుడల్లా పార్టీపై రుసరుసలాడుతున్నారు. ఈ మధ్యకాలంలో రెండు లేదా మూడు రోజుల కొకసారి ఆయన ఏదో విధంగా వార్తల్లోకి వస్తున్నారు.

అసలు విషయం ఏంటో తెలీదు. కాకపోతే ఏపీ రాజధాని అమరావతి పరిసర ప్రాంతాల్లో తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. గతరాత్రి ఆయన తాడేపల్లిలో బస చేసినట్టు తెలుస్తోంది. ఏపీ మాజీ సీఎం జగన్‌తో భేటీ కావడానికి ఆయన వచ్చినట్టు తెలుస్తోంది.

కారణం ఏంటన్నది పక్కనబెడితే..  ఉదయం 11 గంటలకు బెంగళూరు వెళ్లనున్నారు జగన్. ఈలోపు ఆయనతో భేటీ కావాలని నిర్ణయించినట్టు సమాచారం. అంతకుముందు దుర్గమ్మ గుడిలో అమ్మవారిని దర్శనం చేసుకోనున్నారు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి. ఉన్నట్లుండి ఆయన తాడేపల్లిలో మకాం వేయడానికి కారణమేంటి? అన్నదే తెలుగు రాష్ట్రాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.

ALSO READ: శంషాబాద్ ఎయిర్‌‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత

ఏపీలో పెద్దగా పట్టించుకోలేకపోయినా, తెలంగాణలో రాజగోపాల్‌రెడ్డి గురించి చర్చ జరుగుతోంది. కోమటిరెడ్డి బ్రదర్స్‌ని రాజకీయాల్లోకి తెచ్చింది వైఎస్ఆర్ అని వీలు చిక్కినప్పుడల్లా వాళ్లు చెప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇప్పటికే వైఎస్ పేరు కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రస్తావిస్తూనే ఉంటారు. ఆ అభిమానంతో జగన్‌తో భేటీ అయ్యేందుకు వచ్చారని అంటున్నారు.

మంత్రి పదవి రానుందకు ఆగ్రహంగా ఉన్న ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి, ప్రస్తుతానికి పార్టీ మారే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఏపీలో జరిగే ఓ ప్రైవేటు కార్యక్రమానికి రాజగోపాల్ విజయవాడ వచ్చినట్టు చెబుతున్నారు. జగన్‌ని కలవడం కాదని అన్నారాయన. మొత్తానికి రానున్న రోజుల్లో జగన్-రాజగోపాల్ గురించి ఇంకెన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.

Related News

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిక కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

Big Stories

×