BigTV English
Advertisement

Amaravati News: తాడేపల్లిలో రాజగోపాల్‌రెడ్డి బస.. జగన్‌తో భేటీ? అసలు మేటరేంటి?

Amaravati News: తాడేపల్లిలో రాజగోపాల్‌రెడ్డి బస.. జగన్‌తో భేటీ? అసలు మేటరేంటి?

Amaravati News: రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు ఉండరు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఎవరు.. ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి. మంత్రి పదవి రాలేదని కొన్నాళ్లుగా కాంగ్రెస్ అధిష్టానంపై కారాలు మిరియాలు నూరుతున్నారు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి. తాజాగా ఆయన ఏపీ మాజీ సీఎం జగన్‌తో భేటీ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ మాటరేంటి?


కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మళ్లీ వార్తల్లోకి వచ్చారు. మంత్రి పదవి ఇవ్వనందుకు కాంగ్రెస్ హైకమాండ్‌పై ఆయన ఆగ్రహంగా ఉన్నారు. సమయం, సందర్భం వచ్చినప్పుడల్లా పార్టీపై రుసరుసలాడుతున్నారు. ఈ మధ్యకాలంలో రెండు లేదా మూడు రోజుల కొకసారి ఆయన ఏదో విధంగా వార్తల్లోకి వస్తున్నారు.

అసలు విషయం ఏంటో తెలీదు. కాకపోతే ఏపీ రాజధాని అమరావతి పరిసర ప్రాంతాల్లో తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. గతరాత్రి ఆయన తాడేపల్లిలో బస చేసినట్టు తెలుస్తోంది. ఏపీ మాజీ సీఎం జగన్‌తో భేటీ కావడానికి ఆయన వచ్చినట్టు తెలుస్తోంది.


కారణం ఏంటన్నది పక్కనబెడితే..  ఉదయం 11 గంటలకు బెంగళూరు వెళ్లనున్నారు జగన్. ఈలోపు ఆయనతో భేటీ కావాలని నిర్ణయించినట్టు సమాచారం. అంతకుముందు దుర్గమ్మ గుడిలో అమ్మవారిని దర్శనం చేసుకోనున్నారు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి. ఉన్నట్లుండి ఆయన తాడేపల్లిలో మకాం వేయడానికి కారణమేంటి? అన్నదే తెలుగు రాష్ట్రాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.

ALSO READ: శంషాబాద్ ఎయిర్‌‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత

ఏపీలో పెద్దగా పట్టించుకోలేకపోయినా, తెలంగాణలో రాజగోపాల్‌రెడ్డి గురించి చర్చ జరుగుతోంది. కోమటిరెడ్డి బ్రదర్స్‌ని రాజకీయాల్లోకి తెచ్చింది వైఎస్ఆర్ అని వీలు చిక్కినప్పుడల్లా వాళ్లు చెప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇప్పటికే వైఎస్ పేరు కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రస్తావిస్తూనే ఉంటారు. ఆ అభిమానంతో జగన్‌తో భేటీ అయ్యేందుకు వచ్చారని అంటున్నారు.

మంత్రి పదవి రానుందకు ఆగ్రహంగా ఉన్న ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి, ప్రస్తుతానికి పార్టీ మారే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఏపీలో జరిగే ఓ ప్రైవేటు కార్యక్రమానికి రాజగోపాల్ విజయవాడ వచ్చినట్టు చెబుతున్నారు. జగన్‌ని కలవడం కాదని అన్నారాయన. మొత్తానికి రానున్న రోజుల్లో జగన్-రాజగోపాల్ గురించి ఇంకెన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.

Related News

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ బైపోల్.. బీఆర్ఎస్ కొత్త స్ట్రాటజీ, ప్లాన్ వర్కవుట్ అవుతుందా?

Rain Alert: దూసుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Drugs Case: డాక్టర్‌ ఇంట్లో భారీగా డ్రగ్స్‌.. రూ.3 లక్షల విలువైన మత్తు పదార్థాలు స్వాధీనం

Telangana News: ఎస్ఎల్బీసీ టన్నెల్ సర్వే.. హెలికాఫ్టర్ నుంచి ప్రత్యక్షంగా తిలకించిన సీఎం రేవంత్-మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి

Holiday: గుడ్‌న్యూస్.. రేపు ప్రభుత్వ విద్యాసంస్థలు, కార్యాలయాలకు సెలవు.. కారణం ఇదే!

Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. గవర్నర్ ఆమోద ముద్ర, ఇద్దరి కంటే ఎక్కువ ఉన్నా..

Hyderabad News: కోకాపేట్‌, మూసాపేట్‌ ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల వేలం.. ఎకరం రూ.99 కోట్లు

Adilabad Airport: దశాబ్దాల కల నెరవేరే ఛాన్స్.. ఆదిలాబాద్ విమానాశ్రయం అభివృద్ధి దిశగా రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం

Big Stories

×