Telangana Global Summit-2025: హైదరాబాద్ లోని భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2025 మొదలైంది. తొలుత సమ్మిట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి చిత్ర పటానికి నివాళులు అర్పించారు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, హీరో అక్కినేని నాగార్జున. ఆ తర్వాత వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన స్టాల్స్ని పరిశీలించారు సీఎం సహా మంత్రులు, ఎమ్మెల్యేలు. సమ్మిట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది AI రోబో. హాజరవుతున్న అతిథులకు స్వాగతం పలుకుతోంది.
అంతకుముందు మీడియాతో మాట్లాడిన నటుడు నాగార్జున.. అన్నపూర్ణ స్టూడియోస్ని ఫ్యూచర్ సిటీకి తీసుకొస్తామన్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వ విజన్ డాక్యుమెంట్ చదివానని, చాలా అద్భుతంగా ఉందన్నారు. ఇక్కడ ఒక ఫిలిం హబ్ని తయారు చేయాలని చర్చలు జరుగుతున్నాయని మనసులోని మాట బయటపెట్టారు.
తెలంగాణ మోడర్న్ స్టేట్గా ఎదుగుతుంది: గవర్నర్
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘రాష్ట్ర ఆర్థిక, సాంకేతిక ప్రగతిని మార్చే ప్రముఖులు ఈ ఈవెంట్ కి వచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రగతి కొనసాగుతోంది. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం తోడ్పడుతుంది. తెలంగాణ మోడర్న్ స్టేట్ గా ఎదుగుతుంది. విమెన్ ఎంటర్ ప్రెన్యూర్స్ కి ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుంది. 2047 లో 3 ట్రిలియన్ ఎకానమీ గా తెలంగాణ అవతరిస్తుంది’ అని గవర్నర్ వ్యాఖ్యానించారు.
అన్నపూర్ణ స్టూడియోస్ ని కూడా ఫ్యూచర్ సిటీకి తీసుకొస్తాం- నాగార్జున
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొనడం సంతోషంగా ఉంది
ప్రభుత్వ విజన్ డాక్యుమెంట్ నేను చదివాను, చాలా అద్భుతంగా ఉంది
ఇక్కడ ఒక ఫిలిం హబ్ ని కూడా తయారు చేయాలని చర్చలు జరుగుతున్నాయి
అన్నపూర్ణ స్టూడియోస్… pic.twitter.com/itYwjLK78m
— BIG TV Breaking News (@bigtvtelugu) December 8, 2025