Telangana Rains: గత రెండు రోజుల నుండి తెలంగాణలో వర్షాలు ఎడతెరిపిలేకుండా కురుస్తున్నాయి. అయితే రాష్ట్రానికి వాయుగుండం ఎఫెక్ట్ ఉందని వాతావరణ శాఖ అధికారుల తెలిపారు. దీంతో తెలంగాణకు భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. భారీ వర్షాల కారణంగా ఇప్పటికే పలు జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలెర్ట్ జారీ చేసారు. హైదరాబాద్, నిజామాబాద్, కరీంగనగర్, పెద్దపల్లి, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ జిల్లాలకు నల్గోండ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.
భారీ వర్షాల నేపథ్యంలో ఇటు అధికారులకు సైతం అలర్ట్ అయ్యారు. దీంతో మంత్రి పొంగులేటి రాష్ట్రంలోని ప్రజలకు హై అలర్ట్ జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. భారీ వర్షాలపై డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులతో అత్యవసర టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రమాద ప్రాంతాల ప్రజలను అవసరమైతే వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కలెక్టర్లకు ప్రభుత్వం సూచనలు జారీ చేసింది.
Also Read: తెలిసో తెలియకో యాక్సిడెంట్ చేశాడు.. దీన్ని కుట్ర అంటున్నారు: జగన్
హైదరాబాద్లో భారీ వర్షాలకు ట్రాఫిక్, విద్యుత్, తాగునీటి సరఫరాపై ఎలాంటి ఇబ్బంది పడకుండా ముందస్తుగా చర్యలు చేపట్టాలని అధికారుల ప్రత్యేక దృష్టి సారించారు. జీహెచ్ఎంసీ–హైడ్రా–ట్రాఫిక్ పోలీసులు సమన్వయంతో పనిచేయాలని ప్రభుత్వం ఆదేశాన్నిచ్చింది. రెండు రోజుల భారీ వర్షాలతో రాష్ట్రంలో వర్షపాతం లోటు దాదాపు భర్తీ అయిందని, జూలై 30–31 తేదీల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాల రాష్ట్రంలో కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారుల తెలిపారు. రాబోయే 24 గంటు రాష్ట్ర వ్యాప్తంగా అందూ అలర్టగా ఉండాలని మంత్రి ఆదేశాలిచ్చారు.
Also Read: సినిమా హాల్ ఎక్స్పీరియన్స్..ఇంట్లోనే! ఈ సౌండ్బార్ వైబ్స్ నెక్స్ట్ లెవెల్!