E-Paper
Advertisement

Telangana highcourt: వేణు స్వామిపై మహిళా కమిషన్ నోటీసులపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Telangana highcourt: వేణు స్వామిపై మహిళా కమిషన్ నోటీసులపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Telangana highcourt serious on Women’s Commission about Venuswami issue: సంచలన సెలబ్రిటీల జోశ్యుడు వేణుప్వామికి హైకోర్టులో ఊరట లభించింది. నాగచైతన్య, శోభితల నిశ్చితార్థం తర్వాత వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. వీరిద్దరూ ముహూర్తాలు చూసుకోకుండా అమావాశ్య తిధులలో ఏకం అయ్యారని..సమంత కాపురంలాగానే వీరి కాపురం కూడా విడిపోతుందని అన్నారు. 2027 సంవత్సరం తర్వాత నాగచైతన్య, శోభిత తన జాతకం ప్రకారం విడిపోతారని వ్యాఖ్యలు చేస్తూ ఓ సంచలన వీడియో కూడా విడుదల చేశారు వేణుస్వామి.

మహిళా సంఘానికి ఫిర్యాదు

వేణు స్వామి వ్యాఖ్యలతో సినిమా ఇండస్ట్రీ భగ్గుమంది. సినిమా జర్నలిస్టు సంఘాలన్నీ కలిసి వేణుస్వామిపై మహిళా సంఘానికి ఫిర్యాదు చేశాయి.జర్నలిస్ట్ సంఘాలతో సహా దాని అనుబంధ సంస్థ అయిన తెలుగు ఫిలిం డిజిట్ మీడియా అసోసియేషన్ సైతం ఫిర్యాదు చేశాయి. అయితే ఈ విషయంలో నాగచైతన్య గానీ, శోభిత గానీ వేణుస్వామి మాటలు అంతగా పట్టించుకోలేదు. అయితే వారిద్దరి కన్నా ఇతరులే ఎక్కువగా స్పందించారు. సినీ జర్నలిస్టుల ఫిర్యాదును సీరియస్ గా తీసుకుంది రాష్ట్ర మహిళా కమిషన్. దీనితో వేణుస్వామిని వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసులు పంపించారు.

హైకోర్టు సీరియస్

వేణు స్వామికి తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరేళ్ల శారద నుంచి నోటీసులు జారీ అయ్యాయి. దీనిని సవాల్ చేస్తూ వేణు స్వామి రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్ ను విచారణకు స్వీకరించింది రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం. తెలంగాణ మహిళా కమిషన్ నోటీసుల జారీపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం తెలియజేసింది. అసలు నిశ్చితార్థం చేసుకున్న నాగచైతన్య, శోభితలు ఈ విషయంలో ఎలాంటి స్పందనలూ తెలపలేదు. వారికి లేని అభ్యంతరం మీకెందుకంటూ మహిళా సంఘానికి అక్షింతలు వేసింది. వారి నుంచి ఫిర్యాదులు వస్తే అప్పుడు చూస్తాం..అప్పటి దాకా దీనిపై తాము స్పందించలేమంటూ హైకోర్టు తెగేసి చెప్పింది. అంతేకాదు తెలంగాణ మహిళా సంఘాలు పంపించిన నోటీసులు చెల్లుబాటు కావని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

వేణుస్వామి ఆనందం

దీనితో వేణుస్వామి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బావ స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారు కొందరు మీడియా వ్యక్తులు. వారి ఫిర్యాదు పట్టుకుని మహిళా సంఘాలు కూడా ఇలాంటి నోటీసులు పంపించడం ఎంత మాత్రం భావ్యం కాదని వేణుస్వామి అంటున్నారు. అయితే సినిమా జర్నలిస్టులు మాత్రం ఈ సంగతి ఇక్కడితో వదిలేయమని..దీనిపై ఎంతదాకా అయినా వెళతామని..వేణు స్వామికి తగిన రీతిలో సమాధానం చెబుతామని అంటున్నాయి.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×