తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ శాఖలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వం 20 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ విభాగంలో కీలక మార్పులు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 20 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీల్లో సీనియర్ అధికారులతో పాటు యువ ఐపీఎస్లకు కూడా ప్రాధాన్యత లభించింది. ముఖ్యంగా ట్రాఫిక్ విభాగం, కొత్తగా ఏర్పాటవుతున్న ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లలో కీలక నియామకాలు జరిగాయి.
కీలక నియామకాలు..
బదిలీ అయిన వారిలో గజరావు భూపాల్ను లాజిస్టిక్స్ ఐజీగా నియమించగా, అభిషేక్ మొహంతి విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ డీఐజీగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇంటెలిజెన్స్ విభాగంలో ఆర్. భాస్కరన్ను డీఐజీగా (సీఐ సెల్), అపూర్వారావును ఎస్పీగా ప్రభుత్వం నియమించింది. అదేవిధంగా, హైదరాబాద్ క్రైమ్స్ డీసీపీగా అవినాష్ కుమార్, సీఐడీ ఎస్పీగా వెంకటేశ్వర్లు బాధ్యతలు స్వీకరించనున్నారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘ఫ్యూచర్ సిటీ’ కమిషనరేట్కు అదనపు సీపీగా చందనా దీప్తిని నియమించడం విశేషం. ఇక సైబరాబాద్ అడ్మిన్ డీసీపీగా టి. అన్నపూర్ణను నియమించారు. నగర రవాణా వ్యవస్థను మెరుగుపరిచే క్రమంలో యువ ఐపీఎస్ అధికారి రాహుల్ హెగ్డేకు హైదరాబాద్ సిటీ ట్రాఫిక్-3 డీసీపీగా బాధ్యతలు అప్పగించారు. విజిలెన్స్ ఎస్పీగా ఇప్పటివరకు ఈస్ట్ జోన్ డీసీపీగా ఉన్న బాలస్వామి బదిలీ అయ్యారు.
ఈ బదిలీల్లో యువ ఐపీఎస్ అధికారులకు ట్రాఫిక్, క్రైమ్ విభాగాల్లో కీలక బాధ్యతలు అప్పగించడం ద్వారా క్షేత్రస్థాయిలో పోలీసింగ్ను మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు, నగర ట్రాఫిక్ నియంత్రణ, ఇంటెలిజెన్స్ విభాగాల బలోపేతం దిశగా ఈ బదిలీలు జరిగినట్లు తెలుస్తోంది.
ALSO READ: Vande Bharat Sleeper Train: వందేభారత్ లో నో వీఐపీ కల్చర్, రైల్వేమంత్రి కీలక ప్రకటన!