E-Paper
Advertisement

Telangana Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక పరిణామం.. మాజీ సీఎస్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్‌కు సిట్ నోటీసులు

Telangana Phone Tapping Case:  ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక పరిణామం.. మాజీ సీఎస్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్‌కు సిట్ నోటీసులు
Advertisement

Telangana Phone Tapping Case: తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసును స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్-SIT విచారణ చేస్తోంది. ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఐఏఎస్, మాజీ ఐపీఎస్ అధికారులకు సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై చర్చ మొదలైంది.

ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక పరిణామం

Advertisement

ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కొత్తగా ఏర్పాటైన సిట్ టీమ్ ఆదివారం భేటీ అయ్యింది. ఇప్పటివరకు ఈ కేసుకు సంబంధించిన సేకరించిన వివరాలపై అధికారులు చర్చించారు. ఈ కేసు సుప్రీంకోర్టు పరిధిలో ఉండడంతో ప్రతి విషయాన్ని అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు కాగా, ఇంకా లోతుగా దర్యాప్తు చేయాలని డిసైడ్ అయ్యింది.

తాజాగా అందుతున్న సమాచారం మేరకు.. ముగ్గురు ఐఏఎస్‌లతోపాటు ఐపీఎస్ అధికారులను విచారించింది సిట్. వారిలో ముగ్గురు మాజీ ఐఏఎస్, మాజీ ఐపీఎస్ లను సాక్షులుగా విచారించింది. ఇద్దరు మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను విచారించిందట సిట్. వారి స్టేట్ మెంట్ ని రికార్డు చేసింది. జీఏడీ మాజీ పొలిటికల్ సెక్రటరీ రఘునందన్‌ని విచారించింది తెలుస్తోంది.

Advertisement

ఈ క్రమంలో పలువురికి నోటీసులు ఇస్తోంది. మాజీ సీఎం సోమేష్‌కుమార్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్‌కు సిట్ నోటీసులు ఇచ్చింది. జూబ్లీహిల్స్‌లోని సిట్ ఆఫీసులో విచారణకు రావాలని నోటీసుల్లో ప్రస్తావించారు. సిట్ ఇచ్చిన నోటీసులపై మాజీ అధికారులు హాజరవుతారా?  షెడ్యూల్ ప్రకారం తాము  నిర్ధేశించుకున్న పనులు ఉన్నాయని తప్పించుకుంటారా?

ఇద్దరు మాజీ అధికారులకు సిట్ నోటీసులు

మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్‌రావును SIB ఓఎస్డీగా ఎలా నియమించారు? అనే అంశంపై అప్పటి ప్రభుత్వంలో కీలక వ్యవహరించిన ఈ అధికారులను సిట్ విచారించనుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహరంలో ప్రభాకర్‌రావు ఎవరెవరి నెంబర్లు ఇచ్చారనే దానిపై లోతుగా వివరాలు సేకరించనుంది.

ఈ కేసులో ప్రధాన నిందితుడు మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావుని సిట్ వారం రోజులుగా విచారణ చేస్తోంది. విచారణలో ఆయన ట్యాపింగ్ కు సంబంధించి ఎలాంటి విషయాలు బయటపెట్టలేదని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాకర్ రావు ఇచ్చిన సమాచారంతో తొలుత ఛార్జీషీటు వేయాలని ఆలోచన చేస్తోంది. మరికొందర్ని విచారించిన తర్వాత మరొకటి వేయాలన్నది సిట్ అధికారుల ప్లాన్.

ALSO READ:  మంత్రులతో సీఎం రేవంత్ కీలక భేటీ

అధికారుల విచారణ తర్వాత రాజకీయ, సినీ ప్రముఖులను విచారించే ఛాన్స్ ఉందని అంటున్నారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కీలక దశకు చేరింది. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో దాదాపు 600 మందికి పైగా రాజకీయ, న్యాయమూర్తులు, వ్యాపారవేత్తలు, సినీ, జర్నలిస్టుల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేశారనే ఆరోపణలు లేకపోలేదు.

గతంలో వారు అధికారుల విచారణకు హాజరయ్యారు. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్‌రావు.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పోలీసుల ముందు కొచ్చారు. ప్రస్తుతం ఆయన్ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యుల టీమ్ సుదీర్ఘంగా విచారిస్తోంది కూడా.

 

Related News

Medchal: నడి రోడ్డు పై వరి నాట్లు.. బీఆర్ఎస్ నాయకుల వినూత్న నిరసన..!

ఎండిపోతున్న ప్రాజెక్టులు.. హైదరాబాద్‌కు తగ్గిన నీటి సరఫరా.. రాబోయే రోజుల్లో తిప్పలు తప్పవా?

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

Big Stories

Advertisement
×