E-Paper
Advertisement

Cabinet Meeting: ఈ నెల 21న తెలంగాణ కేబినెట్ భేటీ

Cabinet Meeting: ఈ నెల 21న తెలంగాణ కేబినెట్ భేటీ
Advertisement

Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ మరోసారి భేటీ కానున్నది. ఈ నెల 21న సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కానున్నది. మంత్రులు, ఆయా శాఖల ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, పథకాలకు సంబంధించి నిధుల సమీకరణ, రుణమాఫీ, రైతుభరోసా విధివిధానాలపై చర్చించనున్నారు.

ఆగస్టు 15 లోగా రైతు పంట రుణాల మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ప్రధానంగా ఇదే అంశంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. రుణమాఫీకి సుమారు రూ. 30 వేల కోట్లు, రైతు భరోసాకు మరో రూ. 7 వేల కోట్లు అవసరమవడంతో నిధుల సేకరణ ఎలా చేయాలనే అంశంపైనా మంత్రివర్గంలో చర్చించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు.

Advertisement

అదేవిధంగా ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం, పవర్ కమిషన్ల విచారణ కాలం పెంపుపై నిర్ణయం తీసుకునే అంశంతోపాటు విభజన అంశాల్లోని 9, 10 షెడ్యూల్ కు సంబంధించిన ఆస్తులపై చర్చించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ భేటీలో రైతు భరోసా, రైతు రుణమాఫీపై క్లారిటీ వచ్చే అవకాశముంది.

Also Read: మా హయాంలోనే హైదరాబాద్ రూపు రేఖలు మారిపోయాయి: మంత్రి కోమటిరెడ్డి

Advertisement

ఇది ఇలా ఉంటే.. వ్యవసాయ రంగానికే రాష్ట్ర ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తుందంటూ ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పేర్కొన్న విషయం తెలిసిందే. 41వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతోపాటు ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అప్పు తీసుకోవడం అభివృద్ధిలో భాగమని భట్టి పేర్కొన్నారు. వ్యాపార రంగం అభివృద్ధిలో బ్యాంకులది కీలక పాత్ర అని అన్నారు. వ్యవసాయం, స్థిరాస్తి, ఫార్మా రంగాలకు త్వరితగతిన రుణాలు ఇవ్వాలని కోరుతున్నామన్నారు.

Related News

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

Big Stories

Advertisement
×