CM Revanth Reddy: నేడు తెలంగాణలోని 33 జిల్లాలో కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. తెలంగాణ తల్లి విగ్రహారవిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ వంటి మంత్రులు, పలువురు నేతలు పాల్గొన్నారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ అనంతరం జయ జయహే తెలంగాణ గీతాన్ని ఆలపించిన సీఎం రేవంత్, మంత్రులు..
ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు కోసం ప్రభుత్వం వెచ్చించిన నిధుల గురించి సీఎం వివరాలు తెలియజేశారు. మొత్తం 33 జిల్లాల కలెక్టరేట్లలో విగ్రహాల ఏర్పాటు కోసం రూ. 5.8 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఈ నిధులను పారదర్శకంగా, సక్రమంగా వినియోగించి, నిర్ణీత గడువులోగా ఈ విగ్రహాలను పూర్తి చేయడంలో కృషి చేసిన అధికారులను, శిల్పులను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు
ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన పారిశ్రామిక వేతల సమక్షంలో, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారుల సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ జరుపుకోవడం ఎంతో సంతోషం, శుభ పరిణామం అని సీఎం చెప్పారు.
డిసెంబర్ 9, 2009 నాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని ప్రకటించింది. దీంతో ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజలు అంటే నాలుగు కోట్ల ప్రజలు యొక్క ఆకాంక్షను ప్రతిబింబిస్తూ యూపీఏ ప్రభుత్వం తెలంగాణకు ఎంతో సంతోషాన్ని అందించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సారి ఏర్పడిన ప్రజా పాలన ఇందిరమ్మ రాజ్యంలో డిసెంబర్ 9కు ఉన్న ప్రాధాన్యతను గుర్తించింది.
Also Read: డ్రైవర్ డ్రంకెన్ డ్రైవింగ్.. లారీని ఢీకొట్టిన స్కూల్ బస్సు.. స్పాట్లో
60 సంవత్సరాల బలమైన ఆకాంక్షను నెరవేర్చిన పర్వదినాన్ని తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవంగా జరుపుకోవాలని.. రాష్ట్ర ప్రభుత్వం అధికారిక నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రతి సంవత్సరం డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఆవిష్కరణ ఉత్సవాలను జరుపుకుంటున్నాం అని తెలిపారు..