E-Paper
Advertisement

Student Protest: ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద ఆందోళనలు.. జాగృతి విద్యార్థి విభాగం నేతలు అరెస్టు

Student Protest: ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద ఆందోళనలు.. జాగృతి విద్యార్థి విభాగం నేతలు అరెస్టు

Student Protest: హైదరాబాద్ నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం నేతలు.. బోర్డు కార్యాలయాన్ని ముట్టడించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న 300 మంది విద్యార్థులకు హల్ టికెట్లు ఇవ్వకుండా ఇంటర్ బోర్డు అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తూ.. కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. పెద్ద ఎత్తున ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ ఇంటర్ బోర్డుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

అయితే జాగృతి స్టూడెంట్ నేతలు కొందరు గేటు ఎక్కి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పరిస్థితులు అదుపుతప్పాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనకు దిగిన విద్యార్థి నేతలను అరెస్టు చేసి తమ వాహనాల్లో బలవంతంగా తీసుకెళ్లారు. హాల్ టికెట్ ఇవ్వండా విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని జాగృతి విద్యార్థి విభాగం నేతలు ఆరోపిస్తున్నారు. తక్షణమే 300 మంది విద్యార్థులకు హాల్ టికెట్లు ఇచ్చి.. పరీక్ష రాసేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Also Read: CM Revanth Reddy: క్రొయేషియా, భూటాన్ ప్రధానులతో.. సీఎం రేవంత్ రెడ్డి విందు.. రాష్ట్రం కోసం కీలక విజ్ఞప్తి

రాష్ట్రంలో గత రెండేళ్లుగా విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని జాగృతి స్టూడెంట్ విభాగ నేతలు ఆరోపించారు. సంబంధిత మంత్రి దీనిపైన ఒక్క ప్రెస్ మీట్ నిర్వహించిన పాపాన పోలేదని మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు న్యాయం చేయాలంటూ రోడ్డు మీదకు వస్తే దౌర్జన్యంగా అరెస్టు చేస్తున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు అన్యాయం జరుగుతుంటే అడిగే హక్కు లేదా? అని నిలదీస్తున్నారు. విద్యార్థుల ప్రయోజనాల కోసం తెలంగాణ జాగృతి పోరాడుతూనే ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.

Also Read: Yllampet Municipality: ఎల్లంపేట్ మున్సిపాలిటీలో అధికారుల ఇష్టా రాజ్యం.. సమయమైనా కనిపించని అధికారులు

Related News

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

Big Stories

×