Yellampet Municipality స్వేఛ్చ బ్యూరో: ఎల్లంపేట్ మున్సిపాలిటీలో కమిషనర్ స్వామి నాయక్(Commissioner Swami Nayak) సమయపాలన పాటించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. శనివారం ఉదయం 11.20 గంటలు అయినా ఎల్లంపేట్ మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ అందుబాటులో లేకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయానికి ఆలస్యంగా రావడం, కొన్ని సందర్భాల్లో అందుబాటులో లేకపోవడం వల్ల ప్రజా సమస్యలు పేరుకుపోతున్నాయని పేర్కొన్నారు.
Also Read: Real Story: మరణాన్ని కళ్లారా చూసి బయటపడిన ఓ వ్యక్తి కథ
అత్యవసర సమస్యలపై ఫోన్ ద్వారా సంప్రదించేందుకు పలుమార్లు ప్రయత్నించినా స్పందన లభించడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫోన్ కాల్స్కు స్పందించకపోవడం, తిరిగి కాల్ చేయకపోవడం వల్ల సమస్యల పరిష్కారం ఆలస్యమవుతోందని అంటున్నారు. ఇదే సమయంలో ఎల్లంపేట్ మున్సిపల్ మేనేజర్ అబ్దుల్ సలాం(Manager Abdul Salam) కూడా సమయానికి కార్యాలయానికి రాకపోవడం పై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని పేర్కొన్నారు.
ప్రజలకు సమయానికి అందుబాటులో ఉండి, ఫోన్ కాల్స్కూ స్పందిస్తూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. మున్సిపల్ పరిపాలనలో సమయపాలన, స్పందన మెరుగుపరిస్తే ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని అభిప్రాయపడుతున్నారు.
Also Read: Old Toothbrush: పాత టూత్ బ్రష్ పడేసే కన్నా ఎన్ని రకాలుగా వాడవచ్చో తెలుసా?