Singareni Tension: భూపాలపల్లి సింగరేణి 5 ఇంక్లైన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. టిఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను పోలీసులు అడ్డుకున్నారు. కల్వకుంట్ల కవిత బాయిబాట కార్యక్రమంలో భాగంగా గనుల సందర్శన, కార్మికులతో భేటీ కావడం కోసం కవిత బాయిబాట కార్యక్రమం నిర్వహించారు.
Also read: హైదరాబాద్లో ఇళ్లు కట్టేవాళ్లకు బిగ్ షాక్.. జీవో 626 జారీ రూల్స్ బ్రేక్ చేస్తే సర్టిఫికేట్ రద్దు!
దీనిలో భాగంగా కవిత గేటు వద్దకు వెల్లగా పోలీసులు కవితను అడ్డుకున్నారు. గనుల వద్దకు కవిత వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో టీఆర్ఎస్ కార్యకర్తలకు మరియు పోలీసులుకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. టిఆర్ఎస్ శ్రేణులకు పోలీసులకు మధ్య కొద్ది సేపటివరకు వాగ్వాదం, తోపులాట జరిగింది. దీంతో ఆగ్రహిచిన టీఆర్ఎస్ నాయకులు సిగరేని కేటీకే-5 గేటు పైకి ఎక్కి లోపలికి వెల్లే ప్రయత్నం చేశారు. అనంతరం గేట్లను తోసుకుంటూ మైన్ లోపలికి కవిత వెల్లారు.
సింగరేణి అధికారుల పీఆర్పీ చెల్లింపునకు డిప్యూటీ సీఎం లంచం అడుగుతున్నారని కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. నిషేధిత డిటోనేటర్ల కొనుగోలు, కారుణ్య నియామకాలు, మెడికల్ బోర్డు వంటి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కవిత డిమాండ్ చేశారు. ఈ సమస్యలంన్నింటిని జూలై 20 వరకు రాష్ట్ర ప్రభుత్వం క్లియర్ చేయాలని కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.
భూపాలపల్లిలో ఉద్రిక్తత..
భూపాలపల్లి 5ఇంక్లైన్ దగ్గర టీఆర్ఎస్ ఛీఫ్ కవితను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మైన్లోకి వెళ్లకుండా ఆపడంతో టీఆర్ఎస్ కార్యకర్తలు, పోలీసుల మధ్య వాగ్వావాదం, తోపులాట జరిగాయి. #Bhupalpally #Kavitha #TRS #TelanganaPolitics pic.twitter.com/KOlZxm93QV
— BIG TV Breaking News (@bigtvtelugu) June 20, 2026
Also Read: Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ లవర్స్ కు షాకింగ్ న్యూస్.. మహా అవుట్…
సింగరేణి సమస్యలపై కవిత సంచలన వ్యాఖ్యలు
సింగరేణి అధికారుల పీఆర్పీ చెల్లింపునకు డిప్యూటీ సీఎం లంచం అడుగుతున్నారని కవిత సంచలన ఆరోపణలు చేశారు. నిషేధిత డిటోనేటర్ల కొనుగోలు, కారుణ్య నియామకాలు, మెడికల్ బోర్డు వంటి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జూలై 20 వరకు… https://t.co/liD9fkeMqX pic.twitter.com/GJ0RkSwMhQ
— BIG TV Breaking News (@bigtvtelugu) June 20, 2026