Podarillu Mahalakshmi : ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా ఎప్పటికప్పుడు ప్రేక్షకులను అలరించే విధంగా కొత్త సీరియల్స్ ని ప్రసారం చేస్తుంది.. ఈమధ్య చాలా సీరియల్స్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసాయి.. అందులో కొన్ని సీరియల్స్ అయితే మంచి రేటింగ్ ని నమోదు చేసుకుంటూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాయి.. అయితే ఇటీవల ప్రారంభమైన సీరియల్స్లలో పొదరిల్లు సీరియల్ ఒకటి.. గత ఏడాది బిగ్ బాస్ సీజన్ 9 అయిన వెంటనే ఈ సీరియల్ ప్రారంభమైంది. అప్పటినుంచి ఈ సీరియల్ ప్రతిరోజు డిఫరెంట్ స్టోరీ తో జనాలని బాగా ఆకట్టుకుంటుంది. ఇందులో హీరోయిన్ క్యారెక్టర్ గురించి ఇప్పటికే సోషల్ మీడియాలో అనేక వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఈ హీరోయిన్ సీరియల్ నుంచి తప్పుకుపోతుంది అంటూ ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో ఔట్ టాపిక్ గా మారింది. నిజంగానే మహా ఈ సీరియల్ నుంచి తప్పుకుంటుందా? లేదా? అన్నది ఒకసారి కాస్త వివరంగా తెలుసుకుందాం..
స్టార్ మా లో ప్రసారం అవుతున్న పొదరిల్లు హీరోయిన్ మహాలక్ష్మి గురించి సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంటుంది.. ఈమధ్య ఆమె సినిమాలలో కూడా ఎంట్రీ ఇస్తుందని సామాజిక మాధ్యమాల్లో వార్తలు ప్రచారంలో ఉన్నాయి.. ఇప్పుడు టాప్ లో కొనసాగుతున్న ఈ సీరియల్ నుంచి హీరోయిన్ మహాలక్ష్మి తప్పుకుంటుంది అంటూ ఓ వార్త షికారు చేస్తుంది.. మహాలక్ష్మి గురించి ఇలాంటి వార్తలు రావడానికి కారణం ఆమె ఇప్పుడు కన్నడలో బిజీ గా సీరియల్స్ చేయడమే.. అవును మీరు విన్నది నిజమే ప్రస్తుతం మహాలక్ష్మి తెలుగులో కన్నా కన్నడలో బాగా బిజీగా మారింది.. దానివల్లే ఆమె సీరియల్ నుంచి తప్పుకుంటుంది అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.. ఒకవేళ ఇదే గనక నిజమైతే ఈమె ఫాన్స్ మాత్రం చాలా మిస్ అవుతారని అర్థమవుతుంది.. ఈ వార్తలపై క్లారిటీ రావాలంటే ఈ హీరోయిన్ రెస్పాండ్ అయ్యేవరకు వెయిట్ చేయాల్సిందే మరి..
Also Read : ‘గుండెనిండా గుడిగంటలు’ మీనా ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. ఇదే ట్విస్ట్..
పొదిరిల్లు హీరోయిన్ మహాలక్ష్మి బ్యాగ్రౌండ్ విషయానికి వస్తే ఈమె కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ముద్దుగుమ్మ.. అక్కడ పలు సీరియల్స్లలో నటించి నటిగా ప్రేక్షకులు మనసుల్లో చెరగని ముద్ర వేసుకుంది. అదేవిధంగా మోడల్ గా కూడా పనిచేసే తన అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.. ఇక తెలుగులో ఈమె మగువ ఓ మగువా అనే సీరియల్ తో ప్రేక్షకులను పలకరించింది. మొదటి సీరియల్ అయినా కూడా ఆమె నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా. ఆ తర్వాత ఇప్పుడు మరోసారి తెలుగు ప్రేక్షకులకు పొదరిల్లు సీరియల్ తో పలకరించింది. ఇది ఆమెకు రెండో సీరియల్ కావడంతో డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంది. ప్రస్తుతం మహాలక్ష్మి అలియాస్ కృతిక ఉమా శంకర్ ఒక్కరోజు రెమ్యూనరేషన్ దాదాపు 35 వేలకు పైగానే ఉంటుందని తెలుస్తుంది..