E-Paper
Advertisement

Telangana Group -2: గ్రూప్ -2 పరీక్షల షెడ్యూల్ విడుదల

Telangana Group -2: గ్రూప్ -2 పరీక్షల షెడ్యూల్ విడుదల

Telangana Group -2 : టీజీపీఎస్సీ గ్రూప్ -2 పరీక్షల షెడ్యూల్ ప్రకటించింది. రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. డిసెంబర్ 15, 16 తేదీల్లో పరీక్షలను నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో గ్రూప్ -2 పరీక్షలను నిర్వహించున్నారు.

తెలంగాణ గ్రూప్-2 పరీక్షల కొత్త షెడ్యూల్ విడుదలైంది. డిసెంబర్ 15, 16 తేదీల్లో పరీక్షలను నిర్వహించున్నట్లు టీజీపీఎస్సీ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం పరీక్షలు ఆగస్టు 7, 8 తేదీల్లోనే జరగాల్సి ఉంది. కానీ ఆ తేదీల్లో డీఎస్సీ , గ్రూప్ -2 పరీక్షలకు మధ్య వారం రోజులు మాత్రమే వ్యవధి ఉండటంతో ఈ పరీక్షలు డిసెంబర్ కు వాయిదా వేయాలంటూ అభ్యర్థులు ఆందోళనలకు దిగారు. దీంతో గ్రూప్ -2 పరీక్షలను డిసెంబర్ కు రీషెడ్యూల్ చేస్తున్నట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది. తాజాగా పరీక్షల షెడ్యూల్ కూడా ప్రకటించింది. మొతం 783 గ్రూప్-2 పోస్టులకు 5.51 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.

Also Read: గ్రామ పంచాయతీ ఎన్నికల తాజా అప్డేట్.. షెడ్యూల్ విడుదల

తాజా గ్రూప్ -2 పరీక్షల షెడ్యూల్ ప్రకారం రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 10 గంట నుంచి 12.30 గంటల వరకు ఒక సెషన్ , మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండవ సెషన్ లో పరీక్షలు జరుగుతాయని టీజీపీఎస్సీ కార్యదర్శి డా. నవీన్ నికోలస్ వెల్లడించారు. ఈ పరీక్షలు ప్రారంభానికి వారం రోజుల ముందు నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది.

Related News

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

Big Stories

×