The Girl Body Was Injuries by High Tension Wires:హైదరాబాద్ రహమత్ నగర్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. మేడపై ఆడుకుంటున్న ఓ బాలికకు హైటెన్షన్ కరెంట్ వైర్లు తాకడంతో విద్యుద్ఘాతానికి గురైంది. దీంతో బాలిక శరీరం చాలా వరకు కాలిపోయింది. మేడపై ఆడుకుంటుండగా ఈ ఘటన జరిగింది.
ఆమె బంధువులు చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. బాలిక పరిస్థితి విషమంగా ఉందని బంధువులు చెబుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ రహమత్ నగర్ లో మేడపైన ఆ చిన్నారి ఆడుకుంటుంది. ఆ సమయంలో పొరపాటున హైటెన్షన్ వైర్లు తగిలి తీవ్రంగా బాలిక శరీరం కాలిపోయింది.
Also Read: ఏందమ్మా ఇది.. మద్యం మత్తులో యువతీ హల్ చల్..
ఎంతసేపటికి బాలిక మేడపై నుంచి కిందకి రాకపోవడంతో వాళ్ల నాన్న మేడపైకి వెళ్లి చూడగా కరెంట్ షాక్ తగిలి సగం కాలిన శరీరంతో కనిపించింది. అక్కడి నుంచి బాలికను కిందకి తీసుకొని వచ్చి హుటా హుటిన ఆస్పత్రికి తరలించారు. బాలిక శరీరం సగం కాలిపోయి ఉండటం వల్లన ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం బాలికకు చికిత్స అందిస్తున్నారు.