E-Paper
Advertisement

Mahesh Kumar: కేసీఆర్ రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పుల్లో ముంచారు.. ధ్వజమెత్తిన మహేష్ కుమార్ గౌడ్

Mahesh Kumar: కేసీఆర్ రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పుల్లో ముంచారు.. ధ్వజమెత్తిన మహేష్ కుమార్ గౌడ్
Advertisement

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేదల పొట్ట కొడుతూ, కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మెదక్ పర్యటనలో ఉన్న ఆయన, ప్రధాని నరేంద్ర మోదీ అనుసరిస్తున్న విధానాలపై నిప్పులు చెరిగారు. పేదవాడి కష్టాలను పట్టించుకోకుండా, కేవలం అదానీ, అంబానీలు బాగుంటే చాలని మోదీ భావిస్తున్నారని ఆయన ఆరోపించారు.

ఉపాధి హామీ పథకంపై కుట్ర

Advertisement

కాంగ్రెస్ హయాంలో తీసుకువచ్చిన చారిత్రాత్మక ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. ‘అనంతపురం జిల్లా వేదికగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా గాంధీలు ఈ పథకానికి అంకురార్పణ చేశారు. దేశంలోని కోట్లాది మంది పేదలకు ఇది జీవనాధారంగా మారింది. కానీ, నేడు ఈ పథకంలో రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం వాటా ఇవ్వాలని నిబంధనలు పెడుతూ, పరోక్షంగా పథకాన్ని ఎత్తేసేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారు’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ వైఫల్యాలపై విమర్శలు

Advertisement

రాష్ట్రంలోని గత కేసీఆర్ ప్రభుత్వంపై కూడా మహేష్ కుమార్ గౌడ్ విమర్శలు సంధించారు. కేసీఆర్ తన పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని ధ్వజమెత్తారు. ఇప్పటికే 8 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాళా తీయించారని, ఆ భారం ఇప్పుడు ప్రజలపై పడుతోందని పేర్కొన్నారు. పేద ప్రజల సంక్షేమం కంటే స్వప్రయోజనాలకే గత ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిందని విమర్శించారు.

దేశంలో పేదలు ఏమైపోయినా పర్వాలేదు అన్నట్టుగా కేంద్రం తీరు ఉందని, ఉపాధి హామీ నిధుల్లో కోత విధించడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ పేదల పక్షాన ఉంటుందని, ఉపాధి హామీ పథకాన్ని కాపాడుకుంటామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

ALSO READ: Jana Sena Decision: ఎమ్మెల్యే శ్రీధర్ వ్యవహారం.. జనసేన కీలక నిర్ణయం, విచారణ మొదలైంది

Related News

Medchal: నడి రోడ్డు పై వరి నాట్లు.. బీఆర్ఎస్ నాయకుల వినూత్న నిరసన..!

ఎండిపోతున్న ప్రాజెక్టులు.. హైదరాబాద్‌కు తగ్గిన నీటి సరఫరా.. రాబోయే రోజుల్లో తిప్పలు తప్పవా?

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

Big Stories

Advertisement
×