Sama Ram Mohan Reddy: కేంద్రమంత్రి బండిసంజయ్ కొడుకు పై ఫోక్సో కేసు నమొదైన విషయం మనందరికి తెలిసిన విషయమే. అయితే ఈ సంఘటనకు సంభదించి వివిధ రాజకీయ నాయకులు స్పందించి భాదితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ కేసుపై టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి స్పందించి బండి సంజయ్ కొడుకు పై కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ తన చిత్త శుద్దిని నిరూపించుకోవాలని అన్నారు. తన కుమారుడు భగీరథ్ను పోలీసులకు అప్పగించి తన మత్రి పదవికి రాజీనామా చేయాలని రామ్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.
Also read: రూ.5వేలతో ప్రీ బుకింగ్.. శామ్సంగ్ ఏఐ టీవీలపై ఊహించని డిస్కౌంట్
గతంలో హైదరాబాద్లో సంధ్య థియేటర్లో తోక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ నే సీఎం రేవంత్ రెడ్డి వదలలేదని అన్నారు. అలాంటిది మీ కుమారుడు భగీథ్ని ఎలా వదిలేస్తారని గాటుగా ప్రశ్నించారు. తప్పు చేస్తే ఏవరినీ కూడా మా ప్రభుత్వం వదిలిపెట్టదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రజలందరికి సమన్యాయం చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు. తప్పు చేసిన వారు ఏవరైనా శిక్ష అనుభవించక తప్పదని అన్నారు. ఇది ప్రజా ప్రభుత్వం అందరికి సమన్యాయం చేస్తుందని అన్నారు.
Also Read: BSNL సంచలనం.. కేవలం రూ. 61లకే 1000+ లైవ్ టీవీ ఛానళ్లు.. ఓటీటీ కూడా ఫ్రీ!