Advocate Murder: అడ్వకేట్ ఖాజా మొయినుద్దీన్ హత్య కేసులో అరెస్ట్ అయిన టీపీసీసీ ఉపాధ్యక్షుడు ముజాహిద్ ఆలంఖాన్ ను పార్టీ నుంచి బహిష్కరించినట్టు క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి తెలిపారు. న్యాయవాది హత్య కేసులో పోలీసులు ఆలంఖాన్ తోపాటు ఆయన కుమారున్ని కూడా అరెస్ట్ చేసినట్టు పేర్కొన్నారు. ఈ హత్య అంశాన్ని క్రమశిక్షణ కమిటీ తీవ్రంగా పరిగణించి ఆయనపై బహిష్కరణ వేటు వేశామని వివరించారు.
సంచలనం సృష్టించిన అడ్వకేట్ ఖాజా మొయినుద్దీన్ హత్య కేసులో ఏడుగురు నిందితులను నాంపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 10.10 లక్షల రూపాయల నగదు, హత్యకు ఉపయోగించిన స్కార్పియో కారు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీ.సీ.సజ్జనార్ శుక్రవారం అదనపు సీపీ శ్వేత, ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి, టాస్క్ ఫోర్స్ అదనపు డీసీపీ అందె శ్రీనివాసరావుతో కలిసి వివరాలు వెల్లడించారు.
Also read: Shubman Gill Century: గిల్ అదిరిపోయే సెంచరీ..ఫైనల్స్ లోకి గుజరాత్ టైటాన్స్
మాసాబ్ ట్యాంక్ ప్రాంత నివాసి ఖాజా మొయినుద్దీన్ వృత్తిరీత్యా న్యాయవాది. ఈనెల 23న తెల్లవారుఝాము సమయంలో స్విమ్మింగ్ చేయటం కోసం ఇంటి నుంచి బయల్దేరాడు. కారు ఎక్కుతుండగా వేగంగా దూసుకొచ్చిన స్కార్పియో కారు అతన్ని ఢీకొట్టింది. దాంతో ఖాజా మొయినుద్దీన్ దాదాపు పది మీటర్ల దూరంలో ఎగిరిపడి తీవ్రంగా గాయపడ్డాడు. ఆయనను కారుతో ఢీకొట్టిన వారు అక్కడి నుంచి పారిపోయారు. గాయాలకు గురైన ఖాజా మొయినుద్దీన్ ను ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ అదే రోజు చనిపోయాడు.
Also Read: 15 ఏళ్ల వైభవ్ ను బెదిరించిన రియాన్ పరాగ్..ఎందుకురా నీకు ఇంత బిల్డప్ అంటూ!