E-Paper
Advertisement

Train Accident: బెంగుళూరు ఎక్స్ ప్రెస్‌కు స్వల్ప ప్రమాదం.. అరగంటపాటు నిలిపివేత

Train Accident: బెంగుళూరు ఎక్స్ ప్రెస్‌కు స్వల్ప ప్రమాదం.. అరగంటపాటు నిలిపివేత
Advertisement

Minor accident to Bangalore Express: మహబూబ్‌నగర్ జిల్లాలో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. జడ్చర్ల రైల్వే స్టేషన్‌లో బెంగుళూరు ఎక్స్ ప్రెస్‌కు స్వల్ప ప్రమాదం జరిగింది. బుధవారం రాత్రి బెంగుళూరు ఎక్స్ ప్రెస్ జడ్చర్ల రైల్వే స్టేషన్‌కు చేరుకోగానే ఏసీ బోగీలో ఒక్కసారిగా మంటలు చెలరేగి పొగలు వ్యాపించాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే ప్రయాణికులు అధికారులకు సమాచారం అందించారు.

సమాచారం తెలుసుకున్న అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. జడ్చర్ల రైల్వే స్టేషన్‌లో బెంగుళూరు ఎక్స్ ప్రెస్ రైలును సుమారు 30 నిమిషాల పాటు నిలిపివేశారు. అధికారులు పొగలు వచ్చిన బోగీ వద్దకు వెళ్లి పరిశీలించారు. భద్రతా సిబ్బంది ఆక్సిజన్ సిలిండర్ల సహాయంతో పొగలను అదుపులోకి తీసుకొచ్చారు. మరమ్మతులు చేయడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బీ2 ఏసీ బోగిలోని రైలు చక్రాల వద్ద రాపిడికి గురి కావడంతో మోటారులో సాంకేతిక లోపం కారణంగా పొగలు వ్యాపించాయని చెప్పారు. ఈ ప్రమాదం రాత్రి 8.30 గంటలకు జరిగనట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎటువంటి నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. అనంతరం రైలును పంపించారు. ఇదిలా ఉండగా, దేశ వ్యాప్తంగా రైలు ప్రమాదాలు చోటుచేసుకోవడంతో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు.

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×