E-Paper
Advertisement

Train Accident: బెంగుళూరు ఎక్స్ ప్రెస్‌కు స్వల్ప ప్రమాదం.. అరగంటపాటు నిలిపివేత

Train Accident: బెంగుళూరు ఎక్స్ ప్రెస్‌కు స్వల్ప ప్రమాదం.. అరగంటపాటు నిలిపివేత
Advertisement

Minor accident to Bangalore Express: మహబూబ్‌నగర్ జిల్లాలో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. జడ్చర్ల రైల్వే స్టేషన్‌లో బెంగుళూరు ఎక్స్ ప్రెస్‌కు స్వల్ప ప్రమాదం జరిగింది. బుధవారం రాత్రి బెంగుళూరు ఎక్స్ ప్రెస్ జడ్చర్ల రైల్వే స్టేషన్‌కు చేరుకోగానే ఏసీ బోగీలో ఒక్కసారిగా మంటలు చెలరేగి పొగలు వ్యాపించాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే ప్రయాణికులు అధికారులకు సమాచారం అందించారు.

సమాచారం తెలుసుకున్న అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. జడ్చర్ల రైల్వే స్టేషన్‌లో బెంగుళూరు ఎక్స్ ప్రెస్ రైలును సుమారు 30 నిమిషాల పాటు నిలిపివేశారు. అధికారులు పొగలు వచ్చిన బోగీ వద్దకు వెళ్లి పరిశీలించారు. భద్రతా సిబ్బంది ఆక్సిజన్ సిలిండర్ల సహాయంతో పొగలను అదుపులోకి తీసుకొచ్చారు. మరమ్మతులు చేయడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బీ2 ఏసీ బోగిలోని రైలు చక్రాల వద్ద రాపిడికి గురి కావడంతో మోటారులో సాంకేతిక లోపం కారణంగా పొగలు వ్యాపించాయని చెప్పారు. ఈ ప్రమాదం రాత్రి 8.30 గంటలకు జరిగనట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎటువంటి నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. అనంతరం రైలును పంపించారు. ఇదిలా ఉండగా, దేశ వ్యాప్తంగా రైలు ప్రమాదాలు చోటుచేసుకోవడంతో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు.

Related News

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

కుషాయిగూడ పీహెచ్‌సీలో ఊహించని పరిణామం.. డాక్టర్‌గా మారిన డీఎంహెచ్‌ఓ!

Big Stories

Advertisement
×