E-Paper
Advertisement

Man kills wife: కొంప ముంచిన మేకప్, అందంగా ఉందని తట్టుకోలేకోయాడు.. చివరకు చంపి, బాడీని..

Man kills wife: కొంప ముంచిన మేకప్, అందంగా ఉందని తట్టుకోలేకోయాడు.. చివరకు చంపి, బాడీని..
Advertisement

Man kills wife: అందంగా తయారు కావడమనేది ఓ కళ. ఇందుకోసం గంటల కొద్దీ సమయాన్ని కేటాయి స్తారు. అయినా ఒక్కోసారి అందంగా తయారు కాలేదు. ఈ విషయంలో కొందరు మాత్రమే సక్సెస్ అవు తారు. కానీ మనం చెప్పబోయే వ్యక్తి మరో టైపు. భార్య అందంగా తయారు కావడాన్ని తట్టుకోలేకపోయాడు. చివరకు చంపేసి బాడీని అడవిలో పడేశాడు. సంచలనం రేపిన ఈ ఘటన కర్ణాటకలో వెలుగుచూసింది.

కర్ణాటకలోని రామనగర జిల్లా మాగడి ప్రాంతం ఈ ఘటనకు వేదికైంది. 35 ఏళ్ల ఉమేష్- 32 ఏళ్ల దివ్య దంపతులు. అన్నివిషయాలు కలిసి చర్చించుకుని నిర్ణయం తీసుకునేవారు. కాకపోతే దివ్యకు చిన్న కోరిక ఉండేది. అందంగా తయారవ్వాలని భావించేది. ఈ క్రమంలో నిత్యం లిప్‌స్టిక్ వేసుకునేది. మరింత అందంగా ఉండేందుకు టాటూ కూడా వేయించుకుంది.

Advertisement

తనకంటే.. అందానికే భార్య ప్రయార్టీ ఇవ్వడాన్ని తట్టుకోలేకపోయాడు ఆమె భర్త. ఈ క్రమంలో ఉమేష్-దివ్య మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. దివ్యపై భర్తకు అనుమానం పెరిగింది. పని మీద బయటకు వెళ్లినా భార్య విషయం గుర్తుకు వచ్చేది. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని భావించాడు. ఏం చేయాలి.. ఎలా చేయాలనేది నిత్యం ఆలోచించేవాడు. చివరకు ఆమెని చంపాలని నిర్ణయానికి వచ్చేశాడు.

ALSO READ:  కోల్‌కతా వైద్యురాలి కేసు.. మిడ్‌నైట్ అట్టుడుకిన కోల్‌కతా, ఆసుపత్రిలో విధ్వంసం

Advertisement

పరిస్థితి గమనించిన దివ్య.. భర్త టార్చర్ తట్టుకోలేకపోయింది. జీవితాంతం వేధింపులు తప్పవని భావించి విడాకు ల కోసం ఫ్యామిలీ కోర్టులో అప్లై చేసింది. మంగళవారం ఇద్దరూ కలిసి ఫ్యామిలీ కోర్టుకు హాజరయ్యా రు. ఇకపై తన భార్యను అనుమానించనని ఉమే ష్ చెప్పాడు. ఈ విషయాన్ని భార్యకు చెప్పి నమ్మించా డు. తన భర్తలో మార్పు చూసి షాకయ్యిందామె. దాని వెనుక ఉమేశ్ క్రిమినల్ ఆలోచనను అంచనా వేయలేకపోయింది.

కోర్టు నుంచి ఉమేశ్ దంపతులు కలిసి దేవాలయానికి వెళ్లారు. కొండపై దేవాలయం ఉండడంతో అక్కడికి తీసుకెళ్లాడు. దర్శనం తర్వాత అక్కడేవున్న తన నలుగురు ఫ్రెండ్స్‌తో కలిసి భార్యని దారుణంగా చంపేశాడు. మృతదేహాన్ని కనిపించకుండా చీలూరు అటవీ ప్రాంతంలో పడేశాడు.

సీన్ కట్ చేస్తే.. టెంపుల్ నుంచి ఉమేశ్ ఫ్రెండ్స్ వెళ్లిపోయారు. భార్యని అడవిలో పడేశాక ఉమేశ్ ఇంటికి చేరుకున్నాడు. కాకపోతే ఉమేశ్ ముఖ కవళికలు గమనించిన ఇరుగుపొరుగువాళ్లు దివ్య గురించి అడిగారు. ఫలానా దగ్గరకు వెళ్లిందని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. పలుమార్లు నీళ్లు నమిలాడు. చివరకు ఈ వ్యవహారం పోలీసుస్టేషన్‌కు చేరింది.

పోలీసులు రంగంలోకి దిగేశారు. ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు, టెంపుల్ సమీపంలో ఉన్న ఫుటేజ్‌ పరిశీలించారు. ఉమేశ్‌తోపాటు మరో నలుగురు ఉండడం గమనించారు. వెంటనే ఆ నలుగురిలో ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు. ఉమేశ్‌తోపాటు మరొకరు పరారీలో ఉన్నారు. వారికోసం పోలీసులు గాలింపు మొదలుపెట్టారు. సరైన భార్య దొరలేదని కొందరు, అందంగా లేదని మరికొందరు.. ఇతగాడు మాత్రం తన భార్య అందంగా తయారుకావడాన్ని తట్టుకోలేపోయాడు. ఆ అందమే దివ్యకు శాపంగా మారింది.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Vande Mataram Bill: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లో ఆ కీలక బిల్లు?

ఆసుపత్రి నుంచే పార్లమెంట్ మార్చ్‌కు పిలుపు.. సోనమ్ వాంగ్‌చుక్ లేఖతో ఢిల్లీలో తీవ్ర ఉత్కంఠ!

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం.. ఆకస్మిక వరదలు, కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

కర్ణాటకలో ఘోర విషాదం.. పెళ్ళయిన 15 రోజుల్లోనే నవవధువు మృతి.. అసలేం జరిగింది?

నగరాల్లో డెలివరీ బాయ్స్ అరాచకాలు.. ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ నెట్టుకుని లోపలికి, ఆపై..

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

Big Stories

Advertisement
×