E-Paper
Advertisement

TS Congress : ఎంపీ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు.. ఆన్ లైన్‌లో అప్లికేషన్లు..

TS Congress : ఎంపీ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు.. ఆన్ లైన్‌లో అప్లికేషన్లు..
Political news in telangana

TS Congress news (Political news in telangana):

పార్లమెంట్ ఎన్నికలపై తెలంగాణలో కాంగ్రెస్ ఫోకస్‌ పెట్టింది. ఎంపీ అభ్యర్థుల ఎంపిక కసరత్తును షురూ చేసింది. బుధవారం నుంచి ఫిబ్రవరి 3 వరకు ఆశావహుల నుంచి అప్లికేషన్లను స్వీకరించనుంది. ఇందుకోసం గాంధీభవన్‌లో ప్రత్యేక కౌంటర్‌ ఏర్పాటు చేసింది.

ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజును 25 వేలుగా నిర్ణయించింది. మిగిలిన అభ్యర్థులకు అప్లికేషన్‌ ఫీజు 50 వేలు. ఈ మొత్తాన్ని డీడీ ద్వారా చెల్లించాలని సూచించింది. అప్లికేషన్‌ ఫామ్స్‌ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ విషయాన్ని గాంధీభవన్‌ సిబ్బంది ప్రకటించారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ కాంగ్రెస్ ఇదే విధానాన్ని అవలంభించింది. టిక్కెట్ ఆశిస్తున్న నేతల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. ఆశావాహుల పేర్లను వడపోసి తుది జాబితా సిద్ధం చేసింది. ఇప్పుడు లోక్ సభ అభ్యర్థుల ఎంపికకు ఇదే సూత్రాన్ని పాటిస్తోంది.

తెలంగాణలో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ కు ఎంపీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. రాష్ట్రంలో మొత్తం 17 లోక్ సభ స్థానాలున్నాయి. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ మూడు స్థానాల్లో గెలిచింది. ప్రస్తుత సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి అప్పుడు మల్కాజ్ గిరి నుంచి విజయభేరి మోగించారు. నల్గొండ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిచారు. భువనగిరి నుంచి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ 9 స్థానాలను కైవసం చేసుకుంది. బీజేపీకి నాలుగు సీట్లు దక్కగా.. ఎంఐఎం ఒక చోట గెలిచింది.

ఈసారి ఎన్నికల్లో కనీసం 13 స్థానాలు గెలవాలని కాంగ్రెస్ పార్టీ టార్గెట్ పెట్టుకుంది. సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ధపెట్టారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటీ అమలు చేస్తున్నారు. ఇప్పటికే రెండు గ్యారంటీలను అమల్లోకి తీసుకొచ్చారు. మిగిలిన నాలుగు గ్యారంటీలను అమలు చేసి ప్రజల మద్దతు పొందేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×