E-Paper
Advertisement

TSPSC : ముగిసిన టిఎస్పీఎస్సీ మెంబర్స్ అప్లికేషన్ ప్రాసెస్.. సీఎం రాగానే నిర్ణయం..!

TSPSC : తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళనపై.. రాష్ట్ర సర్కారు ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా కొత్త టీమ్​ను నియమించేందుకు కసరత్తు షురూ చేసింది. ఇప్పటికే అప్లికేషన్ ప్రాసెస్ ముగియగా.. కమిషన్ ఛైర్మన్ గా ఇద్దరు ఐపీఎస్​లతో పాటు.. ఇద్దరు ప్రొఫెసర్ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన నుంచి రాగానే టీఎస్​పీఎస్సీ మెంబర్స్ నియామకంపై నిర్ణయం తీసుకునే అవకాశముందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి.

TSPSC : ముగిసిన టిఎస్పీఎస్సీ మెంబర్స్ అప్లికేషన్ ప్రాసెస్.. సీఎం రాగానే నిర్ణయం..!
Advertisement

TSPSC chairman notification(Today news in telangana) :

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళనపై.. రాష్ట్ర సర్కారు ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా కొత్త టీమ్​ను నియమించేందుకు కసరత్తు షురూ చేసింది. ఇప్పటికే అప్లికేషన్ ప్రాసెస్ ముగియగా.. కమిషన్ ఛైర్మన్ గా ఇద్దరు ఐపీఎస్​లతో పాటు.. ఇద్దరు ప్రొఫెసర్ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన నుంచి రాగానే టీఎస్​పీఎస్సీ మెంబర్స్ నియామకంపై నిర్ణయం తీసుకునే అవకాశముందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

కాగా గత ప్రభుత్వ హాయాంలో నియమితులైన టీఎస్​పీఎస్సీ ఛైర్మన్ జనార్ధన్ రెడ్డితో పాటు.. మరో నలుగురు సభ్యులు ఇటీవల రాజీనామా చేశారు. దీంతో కొత్త బోర్డు ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. గత శుక్రవారం దరఖాస్తులను ఆహ్వానించగా.. నిన్నటితో గడువు ముగిసింది. టీఎస్​పీఎస్సీ లో ఛైర్మన్ తో పాటు.. 9 మెంబర్ల పోస్టుల కోసం దాదాపు 200 పైగా దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం అందుతుంది. ఈ-మెయిల్ ద్వారా కూడా కొన్ని మరికొన్ని అప్లికేషన్స్ వచ్చినట్లు తెలుస్తుంది.

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కోసం.. ప్రొఫెసర్లు, గ్రూప్ 1 ఉద్యోగులు, న్యాయవాదులు, సోషల్ వర్కర్లు, వీఆర్ఎస్ తీసుకున్న ఉద్యోగులు సైతం పోటీపడుతున్నారు. నియామకాల్లో పారదర్శకంగా ఉండేందుకు రేవంత్ సర్కార్ టీఎస్పీఎస్సీ ప్రక్షాళనకు పూనుకుంది. యూపీఎస్సీ తరహాలో టీఎస్​పీఎస్సీని కూడా నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. తెలంగాణలో రెండు లక్షల ఉద్యోగుల భర్తీ కోసం రేవంత్ సర్కార్ సన్నాహాలు చేస్తుంది.

Advertisement

కొత్త ఛైర్మన్ గా.. గతేడాది రిటైర్డ్ అయిన ఓ సీనియర్ ఐపీఎస్​ ఆఫీసర్ పేరుతో పాటు ప్రస్తుతం సర్వీస్​లో ఉన్న సీనియర్ ఐపీఎస్ పేరును సర్కారు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. రిటైర్డ్ అయిన ఐపీఎస్ సర్వీస్​ను ఏడాది పాటు పొడిగించి వినియోగించుకోవాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. మరోపక్క ప్రస్తుతం ఉన్నత విద్యాశాఖలో పనిచేస్తున్న హెచ్​సీయూ ప్రొఫెసర్ పేరు కూడా వినిపిస్తోంది. జేఎన్టీయూ సీనియర్ ప్రొఫెసర్, ఓయూ సీనియర్ ప్రొఫెసర్ పేర్లూ కూడా పరిశీలనలో ఉన్నాయి.

Related News

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

వర్షాకాలంలో మొక్కజొన్న తినే.. అలవాటు ఉందా?

Big Stories

Advertisement
×