E-Paper
Advertisement

ORR వద్ద ఘోర ప్రమాదం.. గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరు యువకులు మృతి!

ORR వద్ద ఘోర ప్రమాదం.. గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరు యువకులు మృతి!
Advertisement

Medchal: స్వేచ్ఛ బ్యూరో: మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కండ్లకోయ ఔటర్ రింగ్ రోడ్ (ORR) అండర్‌బ్రిడ్జి వద్ద గురువారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

పోలీసుల వివరాల ప్రకారం.. గురువారం రాత్రి సుమారు 11:50 గంటల సమయంలో కొంపల్లి వైపు వెళ్లే మార్గంలో కండ్లకోయ ORR అండర్‌బ్రిడ్జి వద్ద TS08GU9850 నంబర్ గల పియాజియో ఏప్రిలియా ద్విచక్రవాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో సొహైల్ (18), సుమిత్ గైక్వాడ్ (17) తీవ్ర గాయాల పాలై ఘటన స్థలంలోనే మృతి చెందారు.

Advertisement

మృతుడు సొహైల్ దిల్‌కుష్‌నగర్‌లోని ఎస్. వి. మోడల్ హైస్కూల్ ప్రాంతానికి చెందిన వాడిగా, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి కాగా, మరో మృతుడు సుమిత్ గైక్వాడ్ కుత్బుల్లాపూర్ ప్రభుత్వ పాఠశాల ప్రాంతానికి చెందిన వాడిగా పోలీసులు తెలిపారు.

గుర్తు తెలియని వాహనం ప్రమాదానికి కారణమై అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు ప్రాథమికంగా భావిస్తున్నామని, దీనిపై కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజీలు, ఇతర ఆధారాలను పరిశీలిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Also Read: భ‌ర్త‌ను చంపి రీల్స్ చూస్తూ భార్య ఎంజాయ్.. కొడుకుపై కత్తితో దాడి, కర్ణాటకలో దారుణం

Related News

ఆగస్టు 15 నుంచి కొత్త పెన్షన్లు.. ఒంటరి మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి సీతక్క

హైదరాబాద్‌లో స్టార్ హోటల్‌కి భారీ షాక్.. రూ. 20 లక్షల ఫైన్.. అసలేం జరిగిందంటే?

తెలుగు రాష్ట్రాల్లో చల్లని కబురు.. భానుడి భగభగలకు బ్రేక్.. ఆ జిల్లాల్లో దంచికొట్టిన వానలు!

Health Scheme: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. సరికొత్త హెల్త్ కార్డుల పంపిణీ!

Telangana Sports: టీజీ-20 క్రికెట్ లీగ్ గెలిచిన జట్టుతో.. సీఎం రేవంత్ భేటీ..!

Jangaon News: బచ్చన్న పల్లెల్లో ఏరులై పారుతున్న మద్యం.. పట్టించుకోని యంత్రాంగం!

Wine Shops: రాయపర్తి వైన్స్‌లో జోరుగా అదనపు వసూళ్ల దందా.. పట్టించుకోని అధికారులు

Big Stories

Advertisement
×