E-Paper
Advertisement

Kishan Reddy: రాహుల్ గాంధీ ప్రధానిలా ఫీలయ్యారు.. కిషన్ రెడ్డి సెటైర్లు

Kishan Reddy: రాహుల్ గాంధీ ప్రధానిలా ఫీలయ్యారు.. కిషన్ రెడ్డి సెటైర్లు
Advertisement

Kishan Reddy: ఎన్నికల్లో ఓడిపోయినా సంబరాలు చేసుకుంటున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. మతోన్మాద శక్తులు ఒక్కటై బీజేపీని ఓడించేందుకు కుట్రలు చేశారని మండిపడ్డారు. సోమాజీగూడ జయ‌గార్డెన్‌లో నిర్వహించిన సికింద్రబాద్ సెంట్రల్ జిల్లా విసృత స్థాయి కార్యకర్తల సమావేశంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, సిద్ధాంతపరంగా నడుచుకునే పార్టీ బీజేపీ పార్టీ.

 

Advertisement

బీజేపీపై కాంగ్రెస్ కావాలనే ఎన్నికల సమయంలో తప్పుడు ప్రచారం చేసిందని ఆరోపించారు.చరిత్రలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ని కాంగ్రెస్ పార్టీ అనేక సార్లు అవమానించిందని ఎన్నికల్లో ఓడించాలని కుట్రలు చేసినట్లు ఆయన చెప్పుకొచ్చారు. దేశంలో సిద్ధాంతపరంగా కార్యకర్తల పరంగా ప్రదేశం నృత్యం నేర్చుకుంటే పార్టీ బీజేపీ అని కేంద్ర మంత్రి తెలిపారు కిషన్ రెడ్డి తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచి జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత మూడో సారి మోడీ సాధించి ఆ ఘనత మోదీదే అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. జమ్మూకాశ్మీర్‌లో దేశ వ్యతిరేక వ్యక్తులను పెంచి అందుకు వీలుగా 370ని రద్దు చేసి బడుగు, బలహీన వర్గాలు, మహిళలకు హక్కులు కల్పించిన ఘనత మోదీకే దక్కుతుందన్నారు.

Also Read:ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

Advertisement

పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వంద సీట్లు కూడా సాధించలేదు.. కానీ రాహుల్ గాంధీ మాత్రం తానే ప్రధాని అన్నట్లు ఊహల్లో తేలిపోయాని ఎద్దేవా చేశారు. దేశ చరిత్రలో ఎన్నికల్లో ఓడిపోతే సంబరాలు చేసుకునే పార్టీని మొదటిసారి చూశానని అన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎలక్షన్ ప్రచారం చేసుకోవచ్చు. కానీ దేశ వ్యతిరేక శక్తులు, తీవ్రవాద శక్తులు చాపకింద నీరులా వ్యాపించి బీజేపీ కుతంత్రాలు చూశాయన్నారు. ఓడిపోయిన తర్వాత కూడా అసహనంతో పార్లమెంట్ సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగంపై విపక్ష నాయకుడు రాహుల్ గాంధీ  అబద్దాలు, తప్పుడు ఆరోపణలతో విషం చిమ్మరని ధ్వజమెత్తారు

 

Related News

హైదరాబాద్‌ వాసులకు అదిరిపోయే వార్త.. ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే!

మీర్‌పేట్‌లో అర్ధరాత్రి దారుణం.. బర్త్‌డే వేడుకలకు పిలిచి రౌడీషీటర్ దారుణ హత్య

GHMC ఎన్నికలపై హైకోర్టు సంచలన తీర్పు.. నోటిఫికేషన్‌కు తాత్కాలిక బ్రేక్!

తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టులపై కీలక ప్రకటన.. వరంగల్ ఎయిర్‌పోర్టు నిధులు, టెండర్లు ఆహ్వానంపై

హైదరాబాద్ సిటీలో వాహనదారులకు బిగ్ అలర్ట్.. రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు, ఆయా ప్రాంతాల్లో

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Big Stories

Advertisement
×