BigTV English

Kishan Reddy: తెలంగాణలో ఉన్న ఈ ఆలయాన్ని దర్శించుకోవడం ఇదే మొదటిసారి: కిషన్ రెడ్డి

Kishan Reddy: తెలంగాణలో ఉన్న ఈ ఆలయాన్ని దర్శించుకోవడం ఇదే మొదటిసారి: కిషన్ రెడ్డి

వరంగల్, స్వేచ్ఛ: మోదీ ప్రధాని అయిన దగ్గర నుంచి దేశంలోని ఆలయాల రూపురేఖలు మారుస్తున్నట్టు తెలిపారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. సోమవారం వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అమ్మవారిని దర్శించుకోవడం ఇదే మొదటిసారి. మంత్రి అయిన తర్వాత వెంటనే జమ్ము కాశ్మీర్ ఎన్నికల బాధ్యతలు రావడంతో అక్కడ బిజీబిజీగా గడిపారు కిషన్ రెడ్డి. ఈమధ్యే అక్కడ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. దీంతో వరంగల్ వచ్చి, అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ కూడా భద్రకాళి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారని గుర్తు చేశారు.


Also Read: కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. రాష్ట్రంలోని 92 నియోజకవర్గాల్లో..

దేశంలో చాలా దేవాలయాలను అభివృద్ధి చేశామని, తెలంగాణలో జోగులాంబ, భద్రాచలం, రామప్ప, బల్కంపేట అమ్మవారి దేవాలయాలను అభివృద్ధి చేశామని వివరించారు. అయోధ్య, వారణాసి ఆలయాలతోపాటు పంచ దేవాలయాలను కూడా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు కిషన్ రెడ్డి. దేశవ్యాప్తంగా 150 దేవాలయాలకు పూర్వవైభవం తీసుకొస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రతి పండుగలలో యువత భక్తి శ్రద్ధలతో పాల్గొంటున్నారని, అన్ని రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక వాతావరణం పెరిగిందని చెప్పారు. యువత ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటే పెద్దలపట్ల గౌరవం, సంస్కృతి, సాంప్రదాయాల గురించి తెలుస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో వరంగల్‌లోని భద్రకాళి ఆలయాన్ని కూడా అద్భుతంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. పేదవాడి ఇంట్లో టాయిలెట్ నుంచి మొదలు పెడితే చంద్ర మండలంలో జాతీయ జెండాను నిలిపే వరకు కృషి చేస్తున్నామని చెప్పారు కిషన్ రెడ్డి.


 

Related News

TGPSC Group-1: గ్రూపు-1 వివాదం కీలక మలుపు.. హైకోర్టులో మరో అప్పీలు

Medaram Maha Jatara: మేడారం మహాజాతర డిజిటల్ మాస్టర్ ప్లాన్ విడుదల

Sammakka-Saralamma: వనదేవతలు సమ్మక్క- సారలమ్మలు అన్ని గమనిస్తున్నారు.. కేంద్రంపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

CM Revanth Reddy: సమ్మక్క-సారక్కలకు నిలువెత్తు బంగారం సమర్పించిన సీఎం రేవంత్

Heavy Rains: మరో అల్పపీడనం.. నాలుగు రోజులు వర్షాలు దంచుడే దంచుడు..

Hyderabad News: పండగ సమీపిస్తున్న వేళ.. జోరుగా నాన్ డ్యూటీ లిక్కర్, అధికారులు ఉక్కుపాదం

Hyderabad News: హైదరాబాద్‌ వాసులకు సూచన.. ఆ ప్రాంతాల్లో 24 గంటలపాటు తాగునీటి సరఫరా బంద్

Medaram: నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం పర్యటన

Big Stories

×