Unique Holi Tradition: హోళీ పండగ అంటే ఎక్కడ చూసినా రంగులు చల్లుకుంటూ సరదగా గడపటం చూస్తుంటాం. కానీ, నిజామాబాద్ జిల్లాలోని ఆ ఊర్లో మాత్రం ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. 20 నిమిషాల పాటు ఒళ్లు హూనం అయ్యే విధంగా కొట్టుకున్నారు. అయితే ఇదంతా ఆనవాయితీ వస్తుండటం గమనార్హం. దశాబ్దాల కాలంగా హోలీ రోజున ఈ సంప్రదాయన్ని గ్రామస్థులు పాటిస్తూ వస్తున్నారు. పోలీసులు హెచ్చరించినా వెనక్కి తగ్గడం లేదు.
నిజామాబాద్ జిల్లా సాలూర మండలం హూస్సా గ్రామస్థులు హోళీ రోజున వింత ఆచారాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు.హోళీ రోజు గ్రామస్థులు ఒకరిపై ఒకరు విరుచుకుపడి పిడిగుద్దులు కురిపించుకోవటం ఇక్కడి ఆనవాయితీ. పూర్వీకుల నుండి వస్తున్న సంప్రదాయ క్రీడను హోళీ రోజున నిర్వహించకుంటే గ్రామానికి అరిష్టం జరుగుతదని వీరి విశ్వాసం. అందుకే ఎవరెంత వారించినా వీరు పట్టించుకోరు. చివరికి ఈ ఆటపై పోలీసులు ఆంక్షలు విధించినా డోంట్ కేర్ అంటారు.
గతంలో ఇలాగే ఒకసారి పోలీసుల ఆంక్షల వల్ల హోలీ రోజు పిడిగుద్దులు కురిపించుకోలేదట. దీంతో గ్రామంలో విషజ్వరాలు విజృంభించాయని అరిష్టాలు జరిగాయని గ్రామస్థులు చెబుతున్నారు. అప్పటి నుంచి పోలీసుల ఆంక్షల్ని పట్టించుకోకుండా హోలీ రోజున ఈ కొట్లాటను కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఈసారి కూడా ఎప్పటిలాగానే పిడిగుద్దులు నిర్వహించారు గ్రామస్తులు.
Also Read: V C Sajjanar Orders: విధుల్లో నిర్లక్ష్యం.. ఎస్ఐపై సజ్జనార్ సీరియస్.. కీలక ఆదేశాలు జారీ
మొదట గ్రామ పెద్దలు ఊర్లోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి డప్పు వాయిద్యాలతో గ్రామంలో ఊరేగింపు చేపట్టారు. అనంతరం గ్రామస్తులు రెండు వర్గాలుగా విడిపోయారు. తాడును ఏర్పాటు చేసి రెండు వైపులా రెండు వర్గాల ప్రజలు నిల్చొని 15 నిమిషాల పాటు ఒకరిపై ఒకరి పిడిగుద్దులు కురిపించుకున్నారు. ఈ క్రీడలో చాలా మందికి గాయాలు అయినా వాటిని పట్టించుకోలేదు. పైగా గ్రామం మేలు కోసం ఇలా ఏటా కొట్లాటలో పాల్గొనడం తమకు గర్వంగా ఉందని స్థానికులు చెబుతున్నారు.
Also Read: Real Estate Fraud: హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ స్కామ్.. త్రిపుర కన్స్ట్రక్షన్స్ ఎండీ అరెస్టు