E-Paper
Advertisement

Nampally Durga Mata Idol: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌‌లో దారుణం.. అమ్మవారి విగ్రహం ధ్వంసం, అర్ధరాత్రి కరెంట్ తీసి..

Nampally Durga Mata Idol: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌‌లో దారుణం.. అమ్మవారి విగ్రహం ధ్వంసం, అర్ధరాత్రి కరెంట్ తీసి..
Advertisement

Miscreants broken Durga Mata Idol: ప్రతీ ఏడాది ఎక్కడో దగ్గర హిందు ఆరాధ్య విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు కొందరు వ్యక్తులు. తెలుగు రాష్ట్రాల్లో ఇది మరీ ఎక్కువ. తాజాగా హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అమ్మవారి విగ్రహం ధ్వంసం చేశారు గుర్తు తెలియని వ్యక్తులు.

దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎగ్జిబిషన్ సొసైటీ సిబ్బంది ఆధ్వర్యంలో అమ్మ‌వారి విగ్ర‌హం ఏర్పాటు చేశారు. రాత్రి దండియా కార్య‌క్ర‌మం పూర్తయ్యే వరకూ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఉన్నారు పోలీసులు. అర్థ‌రాత్రి ఎవ‌రూ లేని స‌మ‌యంలో విగ్ర‌హాన్ని ధ్వంసం చేసిన గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు.

Advertisement

ALSO READ: తహసీల్దార్ బదిలీలకు గ్రీన్ సిగ్నల్.. సీసీఎల్ఏ ఆదేశాలు జారీ

కరెంట్ ఆపేసి సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, ఆపై అమ్మ‌వారి విగ్రహం డ్యామేజ్ చేశారు. అమ్మవారి చేతి విరిగిపడి కింద ఉంది. ఉదయం చుట్టుపక్కలున్న భక్తులు విగ్రహం డ్యామేజ్ అయిన విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న వెంటనే ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న‌ారు అబిడ్స్ ఏసీపీ చంద్ర‌శేఖ‌ర్‌.

Advertisement

ఘటన జరిగిన ప్రాంతాన్ని క్షుణ్నంగా పరిశీలించారాయన. వెంటనే కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు బేగంబజార్ పోలీసులు. ఈ ఘటనపై భక్తుల మండిపడుతున్నారు. విగ్రహంపై దాడి చేసిన దుండగులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని పలు హిందు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

గతంలో కాకినాడలో ఇలాంటి ఘటన జరిగింది. దుర్గామాత అమ్మవారి విగ్రహాలను ధ్వంసం చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. అప్పట్లో ఈ వ్యవహారంపై పెద్ద రచ్చ అయ్యింది. ఇప్పుడు హైదరాబాద్ వంతైంది.

 

 

 

 

Related News

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Transfers: అటవీ శాఖ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఇటీవల జరిగిన బదిలీలు రద్దు!

Telangana PCC: ఢిల్లీని షేక్ చేస్తున్న తెలంగాణ.. టీపీసీసీకి రాహుల్ గాంధీ సీక్రెట్ టాస్క్..?

Big Stories

Advertisement
×