E-Paper
Advertisement

Nampally Durga Mata Idol: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌‌లో దారుణం.. అమ్మవారి విగ్రహం ధ్వంసం, అర్ధరాత్రి కరెంట్ తీసి..

Nampally Durga Mata Idol: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌‌లో దారుణం.. అమ్మవారి విగ్రహం ధ్వంసం, అర్ధరాత్రి కరెంట్ తీసి..
Advertisement

Miscreants broken Durga Mata Idol: ప్రతీ ఏడాది ఎక్కడో దగ్గర హిందు ఆరాధ్య విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు కొందరు వ్యక్తులు. తెలుగు రాష్ట్రాల్లో ఇది మరీ ఎక్కువ. తాజాగా హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అమ్మవారి విగ్రహం ధ్వంసం చేశారు గుర్తు తెలియని వ్యక్తులు.

దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎగ్జిబిషన్ సొసైటీ సిబ్బంది ఆధ్వర్యంలో అమ్మ‌వారి విగ్ర‌హం ఏర్పాటు చేశారు. రాత్రి దండియా కార్య‌క్ర‌మం పూర్తయ్యే వరకూ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఉన్నారు పోలీసులు. అర్థ‌రాత్రి ఎవ‌రూ లేని స‌మ‌యంలో విగ్ర‌హాన్ని ధ్వంసం చేసిన గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు.

Advertisement

ALSO READ: తహసీల్దార్ బదిలీలకు గ్రీన్ సిగ్నల్.. సీసీఎల్ఏ ఆదేశాలు జారీ

కరెంట్ ఆపేసి సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, ఆపై అమ్మ‌వారి విగ్రహం డ్యామేజ్ చేశారు. అమ్మవారి చేతి విరిగిపడి కింద ఉంది. ఉదయం చుట్టుపక్కలున్న భక్తులు విగ్రహం డ్యామేజ్ అయిన విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న వెంటనే ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న‌ారు అబిడ్స్ ఏసీపీ చంద్ర‌శేఖ‌ర్‌.

Advertisement

ఘటన జరిగిన ప్రాంతాన్ని క్షుణ్నంగా పరిశీలించారాయన. వెంటనే కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు బేగంబజార్ పోలీసులు. ఈ ఘటనపై భక్తుల మండిపడుతున్నారు. విగ్రహంపై దాడి చేసిన దుండగులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని పలు హిందు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

గతంలో కాకినాడలో ఇలాంటి ఘటన జరిగింది. దుర్గామాత అమ్మవారి విగ్రహాలను ధ్వంసం చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. అప్పట్లో ఈ వ్యవహారంపై పెద్ద రచ్చ అయ్యింది. ఇప్పుడు హైదరాబాద్ వంతైంది.

 

 

 

 

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×