Uttam Kumar Reddy: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం వెయ్యి రోజులు పూర్తి చేసుకోవడం రాష్ట్ర ప్రస్థానంలో ఒక చారిత్రాత్మక మైలురాయి అని పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ నిరంకుశ పాలనకు ముగింపు పలికి, ప్రజలు పోరాడి సాధించుకున్న ప్రజాస్వామ్య స్ఫూర్తిని పునరుద్ధరించడమే ఈ వెయ్యి రోజుల ప్రభుత్వ అతిపెద్ద విజయమని ఆయన స్పష్టం చేశారు.ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు.
గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అధికారం ఒకే కుటుంబం చేతిలో కేంద్రీకృతమైందన్నారు. ప్రజాప్రతినిధులు, ప్రతిపక్షాలు, సామాన్యుల గొంతుకకు విలువ లేకుండా చేశారన్నారు. చివరికి సచివాలయాన్ని కూడా ప్రజలకు దూరంగా ఉంచారన్నారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ సంస్కృతిని మార్చిందన్నారు.. ప్రస్తుతం ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి వచ్చిందన్నారు. ప్రజావాణి, గ్రామసభల ద్వారా పాలనను నేరుగా ప్రజల ముంగిటకు తీసుకెళ్లామన్నారు. ప్రతిపక్షాలు ఆందోళనలు చేస్తున్నాయంటేనే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పునరుద్ధరించబడటానికి నిదర్శన మాని మంత్రి పేర్కొన్నారు.
ఉచిత ఆర్టీసీ ప్రయాణంతో మహిళలకు ఆర్థిక స్వావలంబన లభించిందన్నారు రూ.500 కే వంటగ్యాస్ సిలిండర్ అందిస్తూ పేద కుటుంబాలపై భారాన్ని తగ్గించామ న్నారు. పౌర సరఫరారాష్ట్రంలో 3.42 కోట్ల మందికి ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున ఉచిత సన్నబియ్యం పంపిణీ చేస్తున్నమ న్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నాం అన్నారు.
Also Read: గద్వాల్ మార్కెట్ యార్డులో భారీ గంజాయి కలకలం